NIT Campus: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో-NIT తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తొలి ఇయర్ చదువుతున్నాడు. శివ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది?
హర్యానాలోని కురుక్షేత్ర నిట్లో దారుణం
ఐఐటీలు, ఎన్ఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 19 ఏళ్ల అంగోత్ శివ కురుక్షేత్రలోని నిట్ చదువుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తొలి ఏడాది స్టూడెంట్.
సోమవారం మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లిన శివ తిరిగి భోజనానికి రాలేదు. దీంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చింది. చివరకు అతడి గదికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలిపింది. వెంటనే విద్యార్థి మృతదేహాన్ని నిట్ నుంచి సివిల్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ స్టూడెంట్ శివ ఆత్మహత్య, పేరెంట్స్ అనుమానాలు
ఈ ఘటనను ఆత్మహత్యగా యాజమాన్యం భావిస్తోంది. శివ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిట్ క్యాంపస్ బయట కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. శివ పేరెంట్స్ని ఆసుపత్రి లోపలికి రాకుండా సిబ్బంది అనుమతించలేదు. తమ కుమారుడి మృతి పట్ల కాలేజీ యాజమాన్యం తీరుపై శివ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో శివ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. శివ రూమ్ మేట్స్ ఇద్దరు హర్యానాకు చెందినవారు. ఆ సమయంలో వారిద్దరు భోజనానికి వెళ్లారు. ఉదయం 10 గంటల క్లాసులకు హాజరయ్యాడు శివ.
ALSO READ: దంపతుల ఆత్మహత్య, సూసైడ్ లేఖలో కీలక విషయాలు
రూమ్మేట్స్ భోజనానికి వెళ్లగా అతను తన గదికి తిరిగి వచ్చాడని చెబుతున్నారు అధికారులు. గది లోపలి నుండి లాక్ చేశాడని, పదే పదే తలుపులు తట్టినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. చివరకు రూమ్మేట్ భవనం వెనుక వైపుకు వెళ్లి కిటికీ గుండా చూసి సీలింగ్ ఫ్యాన్కు శివ వేలాడుతూ కనిపించాడని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.