Nellore Bus Accident: నెల్లూరు జిల్లా కోవూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఓ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయణికులతో పాటు.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. బస్సు భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున.. ఐదు గంటల సమయంలో కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు.. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన తోటి ప్రయాణికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.
Also Read: ఘోర ప్రమాదం.. గరుడవారిధి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి.. ఇద్దరు మృతి
క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ నిద్రమత్తు కారణమా? లేక అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ? అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారి పై కొంతసేపు.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి.. బస్సును రోడ్డు పక్కకు తరలించారు. తర్వాత ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది.