E-Paper
Advertisement

Andhra Pradesh: ఇదెక్కడి దారుణం.. తనను చూసి నవ్వాడని నరికి చంపేశాడు..

Andhra Pradesh: ఇదెక్కడి దారుణం.. తనను చూసి నవ్వాడని నరికి చంపేశాడు..
Advertisement

Andhra Pradesh: ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే చంపుకోవడాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్‌స్టాలో కామెంట్ పెట్టాడని.. తన ఫ్రెండ్‌ను ఫాలో అవుతున్నాడని.. పబ్లిక్‌లో పిలిచాడని.. ఇలాంటివి అన్ని అయిపోయాయి. తాజాగా తనను చూసి ఎగతాళిగా నవ్వాడని ఓ బాలుడిని పదునైనా కత్తితో నరికి చంపేశాడో వ్యక్తి.

పదునైనా కత్తితో బాలుడిని నరికి చంపిన వ్యక్తి..
భార్య తనను విడిచి వెళ్లిన అవమానంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న వ్యక్తిని చూసి అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు నవ్వాడు. అది చూసిన వ్యక్తి పదునైన కత్తితో బాలుడిని నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం సృష్టించింది.

Advertisement

భార్య వదిలివెళ్లిందన్న ఒత్తిడితో హత్య చేశాడా..
తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందని హేళనగా నవ్వాడని బాలుడిపై వ్యక్తి దాడి చేశాడు. అయితే విషయం తెలుసుకున్న బాలుడు శ్రీహరి తండ్రి నిందితుడి వద్దకు వెళ్లి తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీశాడు మరోసారి కొడితే ఊరుకోనని హెచ్చరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే శ్రీహరి తండ్రి వెళ్లిపోయిన కాసేపటికే బాలుడికి నిందితుడికి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వ్యక్తి బాలుడి మెడపై పదునైనా కత్తితో నరికేశాడు. తీవ్రంగా గాయపడ్డి బాలుడిని తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Advertisement

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీహరి..
అయితే తీవ్రంగా గాయపడ్డ బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య వదిలి వెళ్లిందన్న ఒత్తిడిలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×