Crime News: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి పట్టణంలోని ఎంటీఆర్ నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు సమీపంలోని నీటి మడుగులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు వంగూరి నాగబాబు (12), వంటిపులి దేవ (12)గా గుర్తించారు. వీరు ఆటపాటల కోసం బయటకు వెళ్లి, సమీపంలోని నీటి మడుగులో ఈత కొట్టేందుకు దిగారు. అయితే మడుగులో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోయారు.
Also read: సైబర్ క్రైం బాధితులకు భారీ ఊరట.. 24.91కోట్ల రీఫండ్!
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఎంటీఆర్ నగర్లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన క్షణం శాశ్వత విషాదంగా మారడంతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది.
Also Read: తెలంగాణ పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?