Road Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న కారు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలువలో పడి గట్టిగా దెబ్బతిన్న కారును బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. లోపల ఉండిపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించాల్సి వచ్చింది.
Also Read: న్యూస్ రూమ్లో యాంకర్ డెడ్ బాడీ.. అక్కడ దొరికిన పేపర్ లో ఏం రాసి ఉందంటే?
కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరొక వ్యక్తికి తీవ్రంగా గాయాలుపాలవడంతో.. సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.