Road Accident: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్ హరిద్వార్ హైవేపై అతివేగంగా దూసుకెళ్తున్న కారు, రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం అర్ధరాత్రి వేళ జరిగింది. రిషికేశ్ నుంచి హరిద్వార్ వైపు వెళ్తున్న కారు, ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆవును తప్పించబోయే క్రమంలో నియంత్రణ కోల్పోయింది. అధిక వేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిపి ఉన్న భారీ ట్రక్కును ఢీకొట్టింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైవేలపై ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ, జంతువుల కారణంగా ప్రమాదాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు రోడ్డుపక్కన ఎందుకు నిలిపి ఉందన్న అంశంపై కూడా విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హైవే భద్రతపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also Read: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!
అతి వేగం థ్రిల్ను ఇవ్వొచ్చు కానీ, అది ప్రాణాలను హరించే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు పాటించడం, పరిమిత వేగంతో వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం నలుగురు యువకుల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, వారి కుటుంబాలను తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
पल भर की मस्ती के चक्कर में काम तमाम. ये भयावह एक्सीडेंट ऋषिकेश में हुआ है. लड़कों का ग्रुप मौज में वीडियो बनाते हुए गाड़ी दौड़ा रहा था. तभी ये हादसा हुआ. pic.twitter.com/xsGXVVzmGw
— Priya singh (@priyarajputlive) December 28, 2025