E-Paper
Advertisement

Tamilnadu Accident: పండుగ పూట ఘోరం.. ట్రిప్‌కి వెళ్తూ కారులోనే సజీవంగా

Tamilnadu Accident: పండుగ పూట ఘోరం.. ట్రిప్‌కి వెళ్తూ  కారులోనే సజీవంగా
Advertisement

Tamilnadu Accident: దసరా పండుగ వేళ తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి మున్నార్‌కు ట్రిప్‌కి వెళ్తున్నారు ఐదుగురు యువకులు. కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? అన్న లోతుల్లోకి వెళ్తే..

ప్రమాదం ఎలా జరిగింది?

Advertisement

తమిళనాడులోని విలుప్పురం జిల్లా విక్రవండి చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు చెన్నై పరిసర ప్రాంతాలైన కోలత్తూర్, అవడి ప్రాంతాలకు చెందినవారు.

తంగవేల్, ఉమానాథన్ సహా మరో ముగ్గురు కలిసి గురవారం ఉదయం కారులో మున్నార్‌కు విహారయాత్రకు బయలు దేరారు. కారు విలుప్పురం జిల్లా విక్రవండి ప్రాంతానికి చేరుకుంది. అది చెన్నై-త్రిచి నేషనల్ హైవే. అతివేగంగా వెళ్తున్న కారు.. లారీని ఓవర్‌ టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.

Advertisement

విహారయాత్రలో విషాదం

తొలుత మీడియంను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీ వంతైంది. దాదాపు 50 మీటర్లు ఈడ్చుకుపోయింది కారు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక-రెస్క్యూ బృందాలు అక్కడకి చేరుకున్నాయి. ఈలోగా స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విక్రవాండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: యువతి గొంతుకోసిన యువకుడు, ఆ తర్వాత

కారు వేగంగా నడుపుతూ లారీని అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తేలింది. ఈ ప్రమాదం కారణంగా హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి, వాహనాలు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేశారు.

తంగవేల్, ఉమానాథన్ తోపాటు మరొకరు మృతి చెందారు. ఈ విషయం తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×