IAS Officer Wife: ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక ఇవాళ అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమెను డిసెంబర్ 31న కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్య దీపిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె సోదరి సరిత పోలీసులను ఆశ్రయించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ పీడీగా విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్ పూల్లో పడి..