Srikakulam Road Accident: నేడు మనిషి ప్రయాణం ఎప్పుడు గమ్యాన్ని చేరుతుందో.. ఎప్పుడు స్మశానానికి చేరుతుందో తెలియని గందరగోళంలో పడిపోయింది. ఒక ప్రమాద వార్త విన్న బాధ నుండి కోలుకోకముందే.. మరో ఘోర వార్త మనల్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. మనం చేసే చిన్న పొరపాట్లు, చూసే అశ్రద్ధ.. నిండు ప్రాణాలను బలితీసుకుంటూ ఎన్నో కుటుంబాల్లో తీరని చీకటిని నింపుతున్నాయి. బయటకు వెళ్లని వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడా.. అన్న భయం ప్రతి ఇంట్లోనూ నీడలా వెంటాడుతోంది. అలాంటి ఘటనే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా నుండి విశాఖపట్నం వస్తున్న సమయంలో బైక్ను తప్పించబోయి లారీ అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యి రెండు ముక్కలు అయ్యింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారతీయ ఆర్మీల ఏఈగా పనిచేస్తున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా.. ఆసుపత్రికి తరలించిన పదేళ్ల బాలిక, నెలల పాప మృతి చెందారు. మరో బాలిక కోమాలోకి వెళ్లింది.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన గంట వరకు పోలీసులు, 108 సిబ్బంది సమయానికి చేరుకోకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని.. సమయానికి వస్తే ప్రాణాలు కాపాడే వారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Hyderabad: ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. స్పాట్లోనే వాళ్లిద్దరినీ ఉతికి ఆరేసిన భార్య