E-Paper
Advertisement

Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే, అసలు కారణం అదే?

Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే, అసలు కారణం అదే?

Vijayawada Crime: విజయవాడలోని భవానీపురం మహిళ హత్య కేసులో ఏం జరిగింది? అసలు నిందితుడు ఎవరు? దగ్గర బంధువే హత్యకు పాల్పడ్డాడా? తన ఫ్యామిలీలో కలహాలకు ఆమె కారణమని భావించి హత్య చేశాడా? అవుననే అంటున్నారు విజయవాడ పోలీసులు. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

విజయవాడ మహిళ హత్య కేసు

విజయవాడ సిటీలో భవానీపురం ప్రాంతంలో 65 ఏళ్ల మహిళ హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితుడు ఆమెను చంపేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళ శరీర భాగాలను పడేశాడు. చిక్కుముడిగా మారిన ఈ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. చివరకు తీగలాగితే డొంకంతా కదిలింది. నిందితుడు ఎవరో తెలుసా? మృతురాలికి అక్క కొడుకు. ఫ్యామిలీ సమస్యల కారణంగా ఆ విధంగా చేసినట్టు తెలుస్తోంది.

విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లో ఉంటోంది 68 ఏళ్ల విజయలక్ష్మి. కొడుకుతో కలిసి వివాహ సంబంధాలు చూస్తుంటారు. ఆమె భర్త పిచ్చయ్య ఆరేళ్ల కిందట చనిపోయాడు. ఆమె అక్క కొడుకు నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం దశాబ్దం కిందట విజయవాడ వచ్చాడు. అతడికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

ముక్కలుగా చేసి పగ తీర్చుకున్న నిందితుడు

తొలుత టైలర్‌గా పని చేశాడు. కొంతకాలం షాపుల్లో గుమస్తాగా పని చేశాడు. ఏం జరిగిందో తెలీదుగానీ సుబ్రహ్మణ్యం దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సుబ్రహ్యణ్యం భార్య ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మహిళ.

తన ఫ్యామిలీని పిన్ని విడదీసిందని అనుమానించాడు సుబ్రహ్మణ్యం. చెప్పుడు మాటల కారణంగా భార్య వెళ్లిందని ఓ అంచనాకు వచ్చాడు. అంతేకాదు మూడేళ్ల కిందట తనపై కొందరు వ్యక్తులు దాడికి చేయడానికి పిన్ని కారణమని భావించాడు. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం, కసి పెంచుకున్నాడు.

ALSO READ:  ముదిరిపోయారు.. ఫామ్‌హౌస్‌లో మైనర్లు ట్రాప్ హౌస్ పార్టీ

సీన్ కట్ చేస్తే.. పిన్నికి ఎవరూ లేకపోవడం గమనించాడు. ఆమెపై పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కొడుకుతో విజయలక్ష్మిని అత్యంత కిరాతంగా హత మార్చాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వాటిని కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పడేశాడు.  గత నెల 30న విజయలక్ష్మి చిట్టినగర్‌లోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఆమెని ఇంటి వద్ద దింపుతానని చెప్పి టూ వీలర్స్‌పై ఇంటికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.  మృతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు . నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×