E-Paper
Advertisement

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన

Visakha Beach: విశాఖపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని యారాడ బీచ్ లో బలమైన అలల తాకిడికి గురై ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చుట్టుపక్కల పర్యాటకు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇటలీ దేశం నుంచి 16 మంది పర్యాటకులు ఇండియా టూర్ కు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు విశాఖలోని యారాడ బీచ్‌ను వీదేశీ టూరిస్టులు సందర్శించారు. సరదాగా సముద్రంలోకి దిగిన ఈ ఇద్దరు పర్యాటకులను అకస్మాత్తుగా వచ్చిన పెద్ద అలలు లోపలికి లాక్కెళ్లాయి. గమనించిన లైఫ్ గార్డులు,  స్థానిక పర్యాటకులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. బీచ్ లో కొట్టుకుపోతున్న ఇద్దరినీ అతి కష్టం మీద రక్షించి ఒడ్డుకు తీసుకురాగలిగారు. అయితే, వారిలో ఒక విదేశీయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)కి తరలించారు.

ALSO READ: Rains: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ పిడుగులు పడే అవకాశం

ఘటనలో మరొక పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటకులు ఎంతటి సరదా కోసం వచ్చినా, సముద్రంలోకి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలని, బీచ్ లో లోతుగా వెళ్లకూడదని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అలలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ALSO READ: BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×