Bribery Case: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఎం.శరత్ కుమార్ పని చేస్తున్నాడు. గ్రామంలోని ఓ వ్యక్తి తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమని దరఖాస్తు చేసుకోగా 30వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు.
Also Read: Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?
చివరకు 20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. మంగళవారం లంచం డబ్బును తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని శరత్ కుమార్ పై కేసులు నమోదు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?