E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 21 ఆవులు మృతి!

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 21 ఆవులు మృతి!
Advertisement

Lightning Strike: ములుగు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి ఒక పేద రైతు అతలాకుతలమయ్యాడు. ఊహించని రీతిలో విరుచుకుపడిన వాన, దానికి తోడైన పిడుగుపాటు ఒకేసారి 21 మూగజీవాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ జీవనాధారంగా నమ్ముకున్న పశువులు కళ్లముందే మృత్యువాత పడటంతో ఆ రైతు కుటుంబం గుండె లవిసేలా రోదిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

పొలంలోనే ఒరిగిపోయిన మూగజీవాలు

Advertisement

తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య రోజులాగే శుక్రవారం సాయంత్రం కూడా తన ఆవులను ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేశాడు. అయితే, రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు పెద్ద పెట్టున ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక భారీ పిడుగు ఆవులు కట్టేసిన ప్రాంతంపై పడింది. ఆ ధాటికి పొలంలో కట్టేసి ఉన్న 21 ఆవులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి ఆవులన్నీ నిర్జీవంగా పడి ఉండటం చూసి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

కోలుకోలేని ఆర్థిక నష్టం.. సాయం కోసం ఎదురుచూపు

Advertisement

ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడటంతో సమ్మయ్యకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆ ఆవుల పాలే ఆ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవులన్నీ చనిపోవడంతో సమ్మయ్య కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. గ్రామంలోని పశువుల యజమానులతో పాటు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత రైతు కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని అంకంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

Related News

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి!

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం.. భవనంపై నుంచి పడి సైట్ ఇంజనీర్ మృతి!

సింగపూర్ ‘వధువు’.. హైదరాబాద్ ‘వరుడు’.. కట్ చేస్తే రూ.కోటిన్నర హాంఫట్!

‘గే’ డేటింగ్ యాప్‌లో పరిచయం.. నమ్మి వెళ్లితే నిలువ దోపిడీ, కిరాతకులు ఏం చేశారంటే?

అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!

పెళ్లయిన 40 రోజులకే నవ వధువు ఆత్మహత్య, విశాఖలో దారుణం, కృష్ణవేణి ఆఖరి కాల్ ఎవరికి?

లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి,మాచర్లలో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్‌కు

Big Stories

×