Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామ శివారులో ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. పోలమూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్పై ప్రయాణిస్తున్నారు. అదుపుతప్పిన బైక్ డివైడర్ను బలంగా ఢీకొనడంతో ముగ్గురూ రోడ్డుపైకి ఎగిరిపడి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పోలమూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించామని, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు బైక్ పై మద్యం సేవించి ఉన్నరా లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణచేపడుతున్నారు.
Also Read: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. స్పాట్లో 36 మంది
ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.