E-Paper
Advertisement

Crime: గుడ్డు కూరపై గొడవ.. భర్త నాలుక కొరికేసిన భార్య, ఎక్కడంటే?

Crime: గుడ్డు కూరపై గొడవ.. భర్త నాలుక కొరికేసిన భార్య, ఎక్కడంటే?

Uttar Pradesh Crime: భార్యాభర్తలు అన్నాక సవా లక్ష సమస్యలు ఉంటాయి. కొందరు అప్పటికప్పుడే వాటిని పరిష్కరించుకుంటారు. మరికొందరు వాటినే తవ్వుకుంటారు.  ఆ దంపతుల మధ్య ఏదో సమస్య వెంటాడింది. కూర విషయంలో గొడవ కారణంగా పట్టరాని కోపంతో భార్య.. తన భర్త నాలుక కొరికివేసింది. సంచలనం రేపిన ఈ ఘటన ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

దంపతుల మధ్య కర్రీ చిచ్చు

యూపీలోని ఘజియాబాద్‌లో ఊహించని ఘటన జరిగింది. మోదీ నగర్ ప్రాంతంలోని సంజయ్ నగర్ కాలనీలో విపిన్-ఇషా దంపతులు ఉంటున్నారు. విపిన్‌కు 27 ఏళ్లు కాగా, ఇషాకు 22 ఏళ్లు ఉంటాయి. మంగళవారం రాత్రి ఇషా ఎగ్ కర్రీ వండింది. అది అతడికి నచ్చలేదు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య నోటి మాటలు తారాస్థాయికి చేరాయి. వీరిని అదుపు చేయడం ఇరుగుపొరుగు వారి వల్ల కాలేదు.

పట్టరాని తన భర్త నాలుకను కొరికింది. ఈ ఘటన తర్వాత విపిన్ అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇషాని కొట్టి బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

భర్త నాలుక కొరికిన భార్య, ఆసుపత్రిలో బాధితుడు

ఘటనకు సంబంధించిన కారణాలపై ఆమెని విచారిస్తున్నారు. విపిన్ తల్లి గీత వెర్షన్ మరోలా ఉంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇషా తన కొడుకు నాలుక ముందు భాగాన్ని కత్తితో కత్తిరించిందని ఆరోపించారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దీనివెనుక అసలు కారణాలు వేరేగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇషా.. ఓ యువకుడ్ని ప్రేమించిందని అతడ్ని వివాహం చేసుకోవాలని కోరుకుందట. కానీ కుటుంబం ఆమెకు బలవంతంగా విపిన్‌తో వివాహం జరిపించారని అంటున్నారు. దీని కారణంగా ఇద్దరి మధ్య చిటీకి మాటికీ వివాదాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. గతేడాది ఆ తరహా ఘటన జరిగిందని అంటున్నారు స్థానికులు

ALSO READ:  రీల్స్ పిచ్చితో దారుణం..  డెలివరీ బాయ్‌పై కత్తులతో దాడి

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×