E-Paper
Advertisement

Litton Das: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే..ఇండియాకు వెళ్లాలంటే వ‌ణుకుపుడుతోంది !

Litton Das: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే..ఇండియాకు వెళ్లాలంటే వ‌ణుకుపుడుతోంది !

Litton Das: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ఆడేది డౌట్ గానే ఉందని తెలుస్తోంది. ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెనుకడుతోంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ ( Litton Das) కీలక ప్రకటన చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ ఆడుతుందో? లేదో? అంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ లిట‌న్‌ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై తాను ఇప్పుడే మాట్లాడడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల‌లో ఇండియాలో పర్యటిస్తే ప్రమాదమే అని వ్యాఖ్యానించారట కెప్టెన్ లిటన్ దాస్ ( Litton Das). దీంతో టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పాల్గొనేది కష్టమే అని అంటున్నారు.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడడం పైన కెప్టెన్ లిటన్ దాస్ ( Litton Das)  సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ జట్టు… ఇండియాలో పర్యటించడం కష్టమే అని అనిపిస్తోందన్నారు. ఈ అంశంపై తాను మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదని వివరించారు. వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఇంకా చాలా దూరంగా ఉంది.. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో బంగ్లాదేశ్ పర్యటిస్తుంది అనే దానిపై తానేమి చెప్పలేను అన్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై తమ జట్టుతో కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా సంప్రదించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కెప్టెన్ లిటన్ దాస్ ( Litton Das) . అయితే ప్రస్తుత పరిస్థితిలో నేపథ్యంలో ఇండియాలో పర్యటిస్తే, బంగ్లాదేశ్ జట్టుకు ఇబ్బంది జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయంలో చాలా సున్నితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందన్నారు.

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య గొడవ ఏంటి ?

ఇండియా అలాగే బంగ్లాదేశ్ ( India VS Bangladesh ) మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. హిందువులను అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు.. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్ల పై సంచలన ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ముస్తాఫిజుర్ రహ్మాన్ ఇలాంటి ప్లేయర్లు ఐపీఎల్ టోర్నమెంట్లు ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. ఇక ఇప్పుడు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని వెల్లడిస్తోంది. తమ మ్యాచ్లకు సంబంధించిన వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరుతోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. కానీ దీనికి ఐసీసీ ( ICC) ఒప్పుకోవ‌డం లేద‌న్న సంగ‌తి తెలిసిందే.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

 

 

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×