E-Paper
Advertisement

Telangana : యూట్యూబ్ చూసి.. ఆ పని చేసి.. అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మహిళలు

Telangana : యూట్యూబ్ చూసి.. ఆ పని చేసి.. అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మహిళలు
Advertisement

Telangana : మహిళలు ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. పురుషులేనా.. తాము కూడా అన్నిట్లోనూ సమానంగా ఉంటామంటున్నారు. జస్ట్ అనడం మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు కూడా. ఈ ట్రెండ్ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. మారుమూల గ్రామాల్లో ఉండే మహిళలు సైతం అప్‌డేట్ అవుతున్నారు. మొబైల్ ఉంటే చాలు. యూట్యూబ్‌లో చూసి సర్వం నేర్చేసుకుంటున్నారు. అలానే ఆ ఇద్దరు మహిళలు యూట్యూబ్ చూసి ఒక్కరోజులోనే దొంగలుగా మారారు. సక్సెస్‌ఫుల్‌గా బంగారం దోచేశారు. ఇక పండగ చేసుకోవచ్చు అనుకుంటుండగా వాళ్ల సీన్ రివర్స్ అయింది.

యూట్యూబ్ వీడియోలు చూసి..

Advertisement

లత, విజయ, సాయికుమార్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన ఆ ముగ్గురు కూలీ పని చేస్తుంటారు. ఎన్నాళ్లని ఇలా కష్టపడతాం? కూలీ పనులతో మన బతుకులు మారుతాయా? అనుకున్నారు. ఏం చేద్దాం అని బాగా ఆలోచించారు. బాగా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యారు. చోరీలు చేయాలని డిసైడ్ అయ్యారు. దొంగతనం చేయడం ఎలా? అంటూ యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అనేక వీడియోలు చూశారు. కళ్లల్లో కారం కొట్టి, కత్తి చూపించి, బంగారం దోచుకునే వీడియో వాళ్లకు బాగా నచ్చింది. ఇదేదో ఈజీగా ఉంది. ఈ పని చేస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. ఏప్రిల్ 24న యూట్యూబ్‌లో ఆ వీడియో చూశారు.. నెక్ట్స్ డే దొంగతనం చేసేందుకు ఫీల్డ్ లోకి దిగిపోయారు.

దోపిడీ ఎలా చేశారంటే..

Advertisement

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బస్టాండ్ దగ్గర ఉన్న మూత్రశాలను తమ దోపిడీకి స్పాట్‌గా ఎంచుకున్నారు. అదును కోసం వెయిట్ చేశారు. అప్పుడే అక్కడకు 60 ఏళ్ల కిష్టాబాయి అనే వృద్ధురాలు వచ్చింది. ఆమె ఒంటిపై బంగారం తళుక్కున మెరిసింది. అది చూసి తమ పంట పండిందనుకున్నారు ఆ కొత్త దొంగలు. యూట్యూబ్‌లో చూసినట్టుగానే.. వృద్ధురాలి కంట్లో కారం చల్లి, కత్తితో దాడి చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఎలా దొరికిపోయారంటే..

వారెవ్వా.. ఫస్ట్ దొంగతనం గ్రాండ్ సక్సెస్ అనుకున్నారు ఆ ముగ్గురు. ఇక తమ తలరాత మారి దశ తిరిగినట్టేనని తెగ సంతోషించారు. కానీ, పోలీసులు ట్విస్ట్ ఇస్తారని అప్పుడు ఊహించలేకపోయారు. ఆ యూట్యూబ్‌ వీడియోలో పోలీసులు పట్టుకునే సీన్ లేదు మరి. బంగారం దోచుకున్నారంటూ బాధిత వృద్దురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో.. సమీపంలోని సీసీఫుటేజ్‌తో.. ముగ్గురు దొంగలను ఈజీగానే పట్టేసుకున్నారు. వారి నుంచి 10 గ్రాముల గోల్డ్, కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పల్లెటూర్లో ఉంటూ కూలీ పనులు చేసుకునే మహిళలు సైతం ఇలా యూట్యూబ్ చూసి దోపిడీ, దొంగతనాలకు పాల్పడటం చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. గురువారం ఆ ముగ్గురు యూట్యూబ్‌లో వీడియో చూశారు.. శుక్రవారం దోపిడీ చేశారు.. శనివారం పోలీసులకు దొరికిపోయారు. అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోయాయి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×