Coimbatore: ప్రేమించలేదన్న కోపంతో ఓ యువకుడు ఘోరానికి ఒడిగట్టాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కక్షతో ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. తమిళనాడుతోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న తొండముత్తూరులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా నివసిస్తున్న ఓ యువతిని నిందితుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అయితే ఆమె అందుకు నిరాకరించడంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బైక్పై యువతి ఇంటికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాంబులను ఒకదాని తర్వాత ఒకటి నేరుగా ఆమె ఇంటిపైకి విసిరి అక్కడ నుంచి వేగంగా పరారయ్యాడు.
బాంబులు పడటంతో ఒక్కసారిగా యువతి ఇంటి ముందు మంటలు చెలరేగాయి. ఆ శబ్దాలు, మంటలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమై నీళ్లు పోసి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!
తన ప్రేమను తిరస్కరించిందనే ఆగ్రహంతో యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన ఘటన కోయంబత్తూరు తొండముత్తూరులో వెలుగుచూసింది. #Thondamuthur #Coimbatore #woman #petrolbombs #house #Swetchadaily pic.twitter.com/uymTyxV19C
— Swetcha Daily News (@SwetchaNews) May 25, 2026