Goddess Lakshmi Worship Process: మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటుంటాం. లక్ష్మీ దేవి అనుగ్రహం లేదు.. అందుకే మా ఇంటిలో డబ్బు నిలవడంలేదు. అదృష్టం లేదు.. మేం ఎంత కష్టపడినా డబ్బులు నిలవడంలేదు. నేనెంత కష్టపడినా నా చేతిలో లక్ష్మీ దేవి నిలువడంలేదని అనే మాటలు వింటుంటాం.
అయితే, కొన్ని పూజలు, వ్రతాలు చేయడం వల్ల సర్వ దరిద్రాలు పోయి సిరి సంపదలే కాదు.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని.. అందులో ముఖ్యంగా లక్ష్మి పూజ చేస్తే తప్పక తమకు సిరి సంపదలు కలుగుతాయని, అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రావంటా. అయితే, ఇందుకు సంబంధించి ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెబుతున్నారంటే.. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అయితే, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కోజాగిరి వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ దరిద్రాలు పోయి అమ్మవారి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.
Also Read: కేసీఆర్కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్కు..
లక్ష్మీ దేవిని పూజించడానికి ప్రత్యేక రోజులుంటాయని చెబుతున్నారు. ఆ రోజుల్లో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మీ ఇంటిలో కష్టాల్లన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని చెబుతున్నారు. ఆస్వీయుజ పౌర్ణమినాడు లక్ష్మీదేవిని పూజించినవారికి సర్వదరిద్రాలు పోయి సిరి సంపదలు కలుగుతాయని వారు చెబుతున్నారు. అంతేకాదు.. వారికి భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు కూడా వారి దరిచేరవని వారు చెబుతున్నారు.