Kurukshetra: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖారావం పవరేంటో..? తెలుసా..? ఆ శంఖానాదానికి కౌరవుల గుండెలు అదిరిపోయేవని ఎంతమందికి తెలుసు.. ఇంకా మహాభారతంలో ఎంత మంది శంఖం పూరించేవారో తెలుసా..? కృష్ణుడి శంఖంతో పాటు మిగతా వాళ్లు పూరించే శంఖాలకు ఉన్న పేర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మహాభారతంలో కృష్ణుడు ఎంతటి పవర్ఫుల్లో ఆయన చేతిలో ఉన్న శంఖం అంతే పవర్ఫుల్. ఒక్కసారి కృష్ణుడు శంఖం పూరిస్తే.. శత్రువుల గుండెలు జారిపోయేవట. ఆ శంఖానాదానికి అంతటి పవర్ ఉండేదటని భారతంలోనే ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. అయితే భారతంలో శ్రీకృష్ణుడే కాకుండా ఇంకా చాలా మంది శంఖం పూరించేవారట. అదే విషయం భగవద్గీత మొదటి ఆధ్యాయంలో 15, 16వ శ్లోకాల్లో ఉందని పండితులు చెప్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పూరించిన శంఖం పేరు ‘పాంచజన్యం’. అంటారట. ఈ పాంచజన్యాన్నే కృష్ణుడు అనేక సందర్భాలలో పూరించేవారని చెప్తుంటారు. ఈ శంఖానాదం వచ్చిందంటే రాక్షస నాశనానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టేనని.. ధర్మ సంస్థాపన మొదలైనట్టేనని నమ్మేవారు. పాంచజన్యం శబ్దానికి అంత ప్రియారిటీ ఉండేదట.
మహా భారతంలో శ్రీ కృష్ణుడే కాదు అర్జునుడు కూడా శంఖం పూరించేవాడు. అయితే అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. ఈ దేవదత్తాన్ని అర్జునుడికి ఇంద్రుడు బహుమతిగా ఇచ్చాడట. శ్రీకృష్ణుడి తర్వాత అంత ప్రాచుర్యం పొందింది అర్జునుడి దేవదత్తమేనని అంటారు.
పాండవులలో రెండో వాడు.. వెయ్యి ఏనుగుల బలం ఉన్న భీముడు కూడా శంఖానాదం చేసేవాడట. అయితే భీముడి శంఖం పేరు పౌండ్రం. ఇది భీముడు పూరిస్తే శత్రువుల గుండెలు అదిరిపోయేవని.. ఆ శంఖం శబ్దం వినే భీముడు కదనరంగంలో ఉన్నాడని శత్రువులు అర్థం చేసుకునేవారట.
కుంతీపుత్రుడు, పాండవులలో పెద్దవాడు ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు కూడా శంఖం పూరించేవాడట. ధర్మరాజు శంఖం పేరు అనంతవిజయం. ఈ అనంత విజయమే ధర్మరాజుకు కురుక్షేత్ర యుద్దంలో అన్నంతమైన విజయాన్ని అందించింది అంటారు. అందుకే ఈ శంఖం విజయానికి సూచికగ బావిస్తారు.
పాండవులలో నాలుగవ వాడు నలుకుడు.. మహా బలవంతుడైన నకులుడు కూడా శంఖం పూరించేవాడట. ఆయన పూరించే శంఖాన్ని సుఘోషం అని పిలుస్తారట. సుఘోషం అంటే మంచి శబ్దం, లేదా నాదం అని అర్థం వస్తుందట. నకులుడు ఆ సుఘోషను ఉపయోగించే ఎన్నో రకాలైన గోవులను వశ్యం చేసుకునేవాడని పండితులు చెప్తుంటారు.
పాండవులలో చివరి వాడు.. శాంత స్వభావం కలవాడైన గొప్ప వీరుడు సహదేవుడు కూడా శంఖం పూరించేవాడట. సహదేవుని శంఖం పేరు మణిపుష్పకం. మణిపుష్పకం అంటే మంచి రత్నాలతో కూడిన పుష్పం అని అర్థం. ఈ శంఖం పూరించే సహదేవుడు ఎవ్వరికీ లొంగని గోవులు, గుర్రాలను మచ్చిక చేసుకునే వాడట.
కురుక్షేత్ర యుద్దంలో ఈ శంఖాలన్నీ ఒక్కసారిగా మోగితే ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని దద్దరిల్లేలా చేసి.. కౌరవుల గుండెలు బద్దలయ్యేలా చేసేవని మహాభారతంలో వ్యాసుడు వర్ణించాడు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.