BigTV English

Lord Krishna: కృష్ణుడికి, 8వ అంకెకు సంబంధం ఏంటి?

Lord Krishna: కృష్ణుడికి, 8వ అంకెకు సంబంధం ఏంటి?

Lord Krishna: శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం అత్యంత విశిష్టమైనది. శ్రీకృష్ణుడి జన్మ, ప్రవర్తన, నిర్ణయాలు.. ఇలా ఆయనకు సంబంధించిన ప్రతి అంశం ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది. ముఖ్యంగా కృష్ణావతారానికి, 8 అంకెకు అవినాభావ సంబంధం ఉంది.


శ్రీమహావిష్ణుడు ఈ భూమ్మీదికి వచ్చిన పది అవతారాల్లో కృష్ణావతారం.. ఎనిమిదవది.
శ్రావణ మాసం, కృష్ణ పక్షంలోని 8వ తిథి అయిన అష్టమి నాటి రాత్రి.. 8వ ఝామున కృష్ణుడు జన్మించాడు.
శ్రీ కృష్ణుడి కంటే ముందు దేవకీవసుదేవులకు ఏడుగురు బిడ్డలు పుట్టారు. కన్నయ్య 8వ సంతానం.
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడికి 8మంది భార్యలు. అలాగే.. ఆయన ప్రేమను అందుకున్న గోపికల సంఖ్య 16,100. ఈ సంఖ్యలోని అంకెలను కూడితే వచ్చేదీ.. ఎనిమిదే.
శ్రీ కృష్ణుడు బోధించిన భగవద్గీతలోని 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం ‘యధాయధాహి ధర్మస్య’ అంటూ తాను శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం ప్రతి యుగంలో అవతరించి, ధర్మ సంరక్షణ చేస్తానని స్పష్టంచేశాడు.
శ్రీ కృష్ణ భగవానుడు భూమిపై 125 సంవత్సరాలు జీవించాడు. మొత్తం మొత్తం 8 అవుతుంది.
కన్నయ్య తన జీవితంలో అష్టకష్టాలను అనుభవించాడు. అలాగే అష్ట సిద్ధులను పొందిన వాడు.
కష్ణతత్వాన్ని అష్టాక్షరీ మంత్రం(ఓం నమో: నారాయణాయ)గా లోకానికి అందించి.. తనను తలచిన వారిని కాపాడుతూ ఉంటాడు.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×