Karthika Masam 2025: కార్తీక మాసం హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు , విష్ణువును పూజించడం ద్వారా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ మాసమంతా పాటించే కఠినమైన నియమాల, వ్రతాలు చివరి రోజున అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
కార్తీక మాసం చివరి రోజు చేయాల్సిన 5 పనులు:
1. దీపారాధన: నదీ స్నానం, దీపం వదలడం:
కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే పవిత్ర నదిలో లేదా చెరువులో స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. వీలైతే, నది ఒడ్డున దీపాలను వెలిగించి, వాటిని నదిలో వదలడం (దీప దానం) అత్యంత శుభప్రదం.
ఐశ్వర్య ఫలితం: ఇలా దీపం వదలడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, పూర్వ జన్మ పాపాలు తొలగి, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని నమ్మకం.
2. శివ, విష్ణువు పూజ:
కార్తీక పౌర్ణమి రోజున శివుడు, విష్ణువు ఇద్దరినీ ఆరాధించాలి.
శివ పూజ: శివలింగానికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజించాలి. ఈ రోజు త్రిపురాసురులను శివుడు సంహరించిన రోజుగా భావిస్తారు.
విష్ణు పూజ: సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ఈ రోజు చాలా శుభకరం. తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించి, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.
ఐశ్వర్యం: ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరి, అఖండమైన ధన లాభం పొందుతారు.
3. తులసి కోట పూజ:
కార్తీక మాసంలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చివరి రోజున, తులసి కోట చుట్టూ 365 వత్తులతో దీపం వెలిగించాలి. దీనిని ఏడాది పొడవునా చేసిన దీపారాధన ఫలంగా భావిస్తారు.
ఐశ్వర్యం: తులసి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసిని పూజించడం ద్వారా ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా ఉంటాయి. అంతే కాకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి.
4. దాన ధర్మాలు చేయడం:
కార్తీక పౌర్ణమి నాడు చేసే దానాలకు అనంతమైన ఫలితం ఉంటుంది. శక్తి మేరకు నిరుపేదలకు, సాధువులకు లేదా దేవాలయాలకు దానం చేయాలి.
ఏం దానం చేయాలి: నువ్వులు, బియ్యం, గోధుమలు, పాలు, నెయ్యి లేదా వస్త్ర దానం చేయడం ఉత్తమం.
ఐశ్వర్య ఫలితం: దానం చేయడం ద్వారా కర్మ బంధాలు తొలగి, లక్ష్మీ కటాక్షం కలిగి, ధన ధాన్యాలు పెరుగుతాయి.
Also Read: ఇంట్లో డబ్బు నిలవడం లేదా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి
5. లక్ష్మీదేవి ఆరాధన:
కార్తీక పూర్ణిమ రాత్రి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఈ రాత్రి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్మకం.
పూజా విధానం: ఇంటిని శుభ్రంగా ఉంచి, పూజా మందిరంలో దీపాలు వెలిగించి.. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠించాలి.
ఐశ్వర్యం: ఈ ప్రత్యేకమైన రాత్రి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే.. ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉండి, అప్పుల బాధలు తొలగిపోతాయి.
ఈ పవిత్రమైన కార్తీక మాసం చివరి రోజును నియమనిష్టలతో ఆచరించి, దైవ కృపకు పాత్రులై అష్టైశ్వర్యాలను పొందాలని కోరుకుంటున్నాము.