Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎప్పటికీ చర్చనీయాంశమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ ఎమ్మెల్యే సరిత తిరుపతయ్యపై గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఆయనకు రెండోసారి..
అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పార్టీ మార్పు, స్పీకర్ ముందు విచారణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వంటి సంఘటనలు రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి .
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2024 జూలై 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారాను, వ్యక్తిగత పనుల కోసం సీఎంను కలవలేదు” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రజల అభీష్టం మేరకే తన రాజకీయ నిర్ణయం ఉంటుందన్నారు.
Also Read: తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కూతురు ప్రేమ.. పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య
అయితే పార్టీ ఫిరాయింపులపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన మరో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పెద్దల్ని కలవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఫిరాయింపు వ్యవహారంలో విచారణ తరువాత ఫలితం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ వెల్లడించారు.
బిగ్ టీవీతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను
ఇప్పటికి రెండు సార్లు స్పీకర్ ముందు నేరుగా విచారణకు హాజరయ్యాను
నియోజకవర్గంలో పనులు కావాలంటే తప్పకుండా సీఎంని వెళ్లి కలవాల్సిందే
నా ప్రాంత అభివృద్ధి కోసమే పార్టీ మారాను… pic.twitter.com/O657yXhYHO
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2025