E-Paper
Advertisement

Mahashivratri 2026: మహాశివరాత్రి 2026.. శుభ ముహూర్తం, పూజా విధానం

Mahashivratri 2026: మహాశివరాత్రి 2026.. శుభ ముహూర్తం, పూజా విధానం

Mahashivratri 2026: మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ. ఈ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన వస్తుంది. ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణలో గడుపుతారు. పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు కావడంతో అర్ధరాత్రి చేసే లింగోద్భవ కాల పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. బిల్వపత్రాలతో శివలింగాన్ని అర్చించి, అభిషేకాలు నిర్వహించడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మహాశివరాత్రి 2026.. విశిష్టత, పూజా విధానం: 

హిందూ పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి కేవలం ఒక పండగ మాత్రమే కాదు.. అది ఒక ఆధ్యాత్మిక చైతన్య రాత్రి. మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకునే ఈ పర్వదినం ప్రకృతి, పురుషుని (శివ-పార్వతుల) కలయికకు ప్రతీక. ఈ ఏడాది ఫిబ్రవరి 15, ఆదివారం నాడు మహాశివరాత్రిని జరుపుకోబోతున్నాము.

ముఖ్యమైన తిథి, ముహూర్తం: ఫిబ్రవరి 15 మధ్యాహ్నం నుంచి చతుర్దశి తిథి ప్రారంభమై.. ఫిబ్రవరి 16 ఉదయం వరకు ఉంటుంది.

నిశిత కాల పూజ (లింగోద్భవ సమయం): ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12నుంచి 12:50 వరకు అత్యంత పవిత్రమైన సమయం.

ఉపవాస విరమణ (పారణ): ఫిబ్రవరి 16 ఉదయం సూర్యోదయం తర్వాత.

ప్రధాన పూజా విధానం:

శివరాత్రి పూజను ప్రధానంగా నాలుగు విభాగాలుగా (నాలుగు జాములు) విభజించవచ్చు. ప్రతి జాములో ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

శుద్ధి: శివరాత్రి నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించాలి. నువ్వుల నూనెతో స్నానం చేయడం శ్రేష్ఠం.

సంకల్పం: “నేను ఈ రోజు శివప్రీత్యర్థం నిరాహారంగా ఉండి, జాగరణ చేస్తాను” అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి.

అభిషేకం: పరమశివుడు ‘అభిషేక ప్రియుడు’. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు), కొబ్బరి నీళ్లు, గంగాజలంతో అభిషేకం చేయాలి.

బిల్వార్చన: “త్రిదళం త్రిగుణాకారం” అని పిలవబడే మూడు ఆకులు కలిగిన బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి.

ఉపవాసం, జాగరణ:
శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. మనసును శివుడిపై ఉంచడం (ఉప అంటే దగ్గరగా.. వాసం అంటే ఉండటం). ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తూ శివ పురాణ పఠనం లేదా “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానోదయం కలిగిస్తుంది.

Also Read: నెలకు ఒక శివరాత్రి ఉన్నా.. మహాశివరాత్రి మాత్రమే ఎందుకు ప్రత్యేకం?

లింగోద్భవ కాల పూజ విశిష్టత:
మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయాన్ని ‘లింగోద్భవ కాలం’ అంటారు. పురాణాల ప్రకారం, బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకార పోరు జరిగినప్పుడు, శివుడు ఆది అంతం లేని మహాగ్ని స్తంభంలా (జ్యోతిర్లింగం) ఆవిర్భవించిన సమయం ఇది. ఈ సమయంలో చేసే పూజ, అభిషేకం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి.

మహాశివరాత్రి మనకు క్రమశిక్షణ, భక్తి , ఏకాగ్రతను నేర్పుతుంది. ఫిబ్రవరి 15న రాబోతున్న ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుని, ఆ సదాశివుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×