E-Paper
Advertisement

Dhumavati Jayanti 2024: పెళ్లైన స్త్రీలు ఈ రోజు పూజ అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

Dhumavati Jayanti 2024: పెళ్లైన స్త్రీలు ఈ రోజు పూజ అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?
Advertisement

Dhumavati Jayanti 2024: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు ధూమావతి జయంతిని జరుపుకుంటారు. తల్లి ధూమావతి తంత్ర సాధన 10 మహావిద్యలలో ఒకటి. ధూమావతిని పూజించడం వల్ల పేదరికం, వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా, మహిళలు అదృష్టం, ఆనందం, శ్రేయస్సు కోసం ఎక్కువగా ఉపవాసాలను పాటిస్తారు. అయితే ధూమావతి జయంతి రోజున ఆమెను పూజించడానికి వివాహితలు భయపడతారట. అసలు పెళ్లైన స్త్రీలు ఈ రోజున పూజలు చేయడానికి ఎందుకు భయపడతారో తెలుసుకుందాం.

ధూమావతి జయంతి

Advertisement

ప్రతి సంవత్సరం ధూమావతి జయంతిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం నేడు ధూమావతి జయంతిని జరుపుకోనున్నారు.

వివాహిత స్త్రీలు ధూమావతిని ఎందుకు పూజించరు ?

Advertisement

ధూమావతి మాత పార్వతి రూపమని శాస్త్రాలలో చెప్పబడింది. వివాహిత స్త్రీలు ఈ రోజున పార్వతీ దేవిని ఆరాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, ఇంట్లో శ్రేయస్సు కోసం పూజిస్తుంటారు. కానీ ధూమావతి మాత రూపంను ఆరాధించడానికి భయపెడుతుంది. వివాహిత స్త్రీలు ధూమావతిని పూజించకూడదని చెబుతారు. అయితే, ధూమావతి జయంతి రోజున పార్వతీ దేవిని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. తల్లి ధూమావతి రూపం వితంతువులా ఉంటుంది. ఆమె వైధవ్యానికి ప్రతీక అని చెప్పబడింది. వివాహిత స్త్రీ తన కలలో కూడా ఈ రూపాన్ని గురించి ఆలోచించదు. అందుకే ధూమావతి మాతను ఆరాధించకూడదని శాస్త్రం కూడా చెబుతుంది.

పార్వతి తల్లి ఎందుకు వైధవ్యం తీసుకుంది ?

తల్లి ధూమావతి వైధవ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆమె రూపం భయంకరంగా, ఉగ్రంగా, మురికిగా ఉంటుంది. ఏ వివాహిత స్త్రీ కోరుకోని రూపంలో ధూమావతి దేవి కనిపిస్తుంది. పురాణాల ప్రకారం, శత్రువులను నాశనం చేయడానికి పార్వతి తల్లి ఈ రూపాన్ని ధరించింది. తెల్లటి దుస్తులు ధరించి జుట్టు చిందరవందర ఉంచుకుని కనిపిస్తుంది. ధూమావతి తల్లి రథ జెండాపై కాకి చిహ్నం కూడా ఉంటుంది. ఇది అశుభం అని అందువల్ల ధూమావతి దేవిని పూజించడానికి వివాహితలు భయపడుతుంటారు.

పురాణాల ప్రకారం, ఒకసారి తల్లి పార్వతికి చాలా ఆకలిగా అనిపించింది. క్రమంగా ఆమె ఆకలి పెరుగుతూ వచ్చింది. ఆకలికి తట్టుకోలేక తన భర్తను అంటే శివుడిని తినేసింది. శివుడిని మింగిన వెంటనే ఆమె స్వరూపం విధవలా మారింది. ఇది చూసిన ఆమె ఆందోళనకు గురై విస్తుపోయింది. అప్పుడు పరమశివుడు నన్ను మ్రింగివేసి ఇప్పుడు విధవ అయ్యావు, ఈ రూపానికి ధూమావతి అని పేరు అని పెట్టారు. ఇలా శాస్త్రం ప్రకారం పార్వతీ దేవికి ధూమావతి అని పేరు వచ్చింది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×