E-Paper
Advertisement

Rudra Mantram: ప్రతి సోమవారం ఈ రుద్ర మంత్రాన్ని పఠించండి, శివుడి రక్షణ మీకు ఉంటుంది

Rudra Mantram: ప్రతి సోమవారం ఈ రుద్ర మంత్రాన్ని పఠించండి, శివుడి రక్షణ మీకు ఉంటుంది
Advertisement

Rudra Mantram: శివుడు మహిమాన్విత దేవుడని హిందువుల నమ్మకం. శివుడి ఉగ్రరూపాన్ని ప్రశాంతపరచడానికి రుద్రమంత్రాలను పఠిస్తారు. ప్రతి సోమవారం శివుడికి అంకితం చేశారు. ఆ సోమవారం నాడు రుద్ర మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితానికి ప్రాణానికి కూడా రక్షణ లభిస్తుందని చెబుతారు. సోమవారం ఉదయం తలకు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని శివలింగానికి ఎదురుగా కూర్చోవాలి. మొదటగా శివలింగంపై గంగాజలంతో అభిషేకం చేయాలి. తర్వాత బిల్వపత్రాలు, పండ్లు, పువ్వులు, గంధం వంటివి సమర్పించి రుద్రమంత్రాన్ని చదవడం ప్రారంభించాలి.

రుద్ర మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి?
రుద్రమంత్రాన్ని 108, 121, 133, లేదా 14,611 సార్లు పఠించవచ్చు. మీ సమయాన్నిబట్టి ఎన్నిసార్లు పఠించాలో నిర్ధారణ చేసుకోండి. ఈ రుద్రమంత్రాన్ని పఠించేటప్పుడు ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. ఇక్కడ మేము రుద్ర మంత్రాన్ని ఇచ్చాము. ఈ రుద్ర మంత్రాన్ని ఎన్ని సార్లు జపించాలో నిర్ణయించుకోండి.

Advertisement

ఇదిగో రుద్రమంత్రం

ఓం నమో భగవతే రుద్రాయ

Advertisement

నమస్తే రుద్రమన్యవ ఉత్తోత ఈశవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యాత ఇషుః శివతమా శివం బభూవ తే
ధనుః శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ
యా తే రుద్ర శివా తనూరఘోరాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవ
శివాం గిరిత్ర తాం కురు మా హింసీః పురుశం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మం సుమనా అసత్
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీః శ్చ సర్వాన్జంభయన్ సర్వాశ్చ యాతుధాన్యః

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః
యే చెమాం రుద్రా అభితో దీక్షు శృతసప్తయః
యే తీష్టంతి రోషితో ద్రాపా ఉతాహ్న్యః
యేషాం విషం మయి శిరో దదామి
అసౌ యోఅవసర్పతి నీలా గ్రీవో విలోహితః
ఉతైనం గోపా ఆదృశన్నాదృశన్నుదహార్యః
ఉతైనం విషా భూతాని స దృష్టో మృడయాతి నః
నమో అస్తు నీలా గ్రీవాయ సహస్రాక్షాయ మీఘుషే
అథో య ఇషుధి స్థస్తే భవంతు నం ఉతాదిటిః

సహస్రాణి సహస్రధా బాహువో హేతయః సమీ

రుద్రమంత్రం పఠిస్తే ఏం జరుగుతుంది?
రుద్రమంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. ఆ శివుని అనుగ్రహాన్ని మీరు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. అనేక వ్యాధుల నుండి మీకు ఉపశమనం దక్కుతుంది. రుద్రమంత్రాన్ని ప్రతి వారం తప్పకుండా సోమవారం పఠించడం నేర్చుకోండి. మీకు మానసిక అశాంతి వంటి సమస్యలు ఉంటే రుద్రమంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారు. మీలో ఆధ్యాత్మిక శక్తిని పెంచడంలో రుద్ర మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది. మీ ఆత్మను శుద్ధి చేయడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది.

రుద్ర మంత్రం పఠించడం వలన మీకు జీవితంలో కావలసిన సకల శుభాలు దక్కుతాయి. ఆయురారోగ్యాలు సంతోషం, ధనం అన్నీ మీరు ఉన్నచోట లభిస్తాయి. అందుకోసం మీరు ఏకాగ్రతతో రుద్ర మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×