E-Paper
Advertisement

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!
Advertisement

Hanuman darshan: లైఫ్‌లో ఒక్కసారైనా.. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసేయాలి. మైసూరు నగరంలో భక్తి, ఆధ్యాత్మికత కలగలిపిన శ్రీ కార్యసిద్ధి అంజనేయ స్వామి సన్నిధి మనసుకు హత్తుకునే ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. 70 అడుగుల ఎత్తైన మహా హనుమంతుడి విగ్రహం, భక్తులను ఆకట్టుకునే లేజర్ షో, కోరికలు నెరవేరుస్తుందనే నమ్మకం ఈ సన్నిధిని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం మైసూరులో ఉన్న శ్రీ కార్యసిద్ధి అంజనేయ స్వామి సన్నిధి భక్తుల ఆత్మలో ఆధ్యాత్మికతను నింపుతున్న పవిత్ర స్థలం. భక్తుల కోరికలను తీర్చే క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం ప్రతీ రోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. మైసూరు నగరంలో ఉన్న ఈ సన్నిధి తన భవన నిర్మాణం, విశేషమైన శిల్పకళ, ఆధ్యాత్మిక వాతావరణంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హనుమంతుని కార్యసిద్ధి శక్తిని ప్రతిబింబించే ఈ ఆలయం, ప్రతి కోరిక నెరవేరుస్తుందనే నమ్మకంతో, దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు.

Advertisement

ఈ ఆలయం యొక్క ప్రధాన విశేషం 70 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఒకే శిలపై చెక్కబడిన ఈ మహా విగ్రహం తన ఆభాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. దివ్యమైన కళ్లతో, భక్తికి ప్రేరణనిచ్చే రూపంతో విరాజిల్లే ఈ విగ్రహం ముందు నిలబడగానే మనసు ప్రశాంతతను అనుభూతి చెందుతుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి ఆధ్యాత్మికతను, పాజిటివ్ ఎనర్జీని మనసారా అనుభవించేలా ఈ సన్నిధి వాతావరణం ఉంటుంది.

ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో విశేషం భక్తుల కోరికల నెరవేర్పుకు సూచకంగా నిర్వహించే పూర్ణఫల దీక్ష. భక్తులు స్వామి సన్నిధిలో ఒక కొబ్బరికాయకు దార కట్టి ఉంచి, తమ కోరికలను హనుమంతుడికి తెలియజేస్తారు. ఆ తర్వాత 16 సార్లు ప్రదక్షిణలు చేసి, 108 సార్లు “ఓం హనుమతే నమః” అని జపిస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి ఆ కొబ్బరికాయను స్వామి పాదాల దగ్గర విరుస్తారు. ఈ ప్రత్యేక ఆచారాన్ని అనుసరించే వేలాది మంది భక్తులు స్వామి కృపను పొందిన అనుభవాలను పంచుకుంటారు.

Advertisement

ఆలయంలో శనివారం, ఆదివారం రోజులు ప్రత్యేకంగా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ రోజుల్లో నిర్వహించే పూజలు, అలంకరణలు, హనుమాన్ చలిసా పారాయణం వంటి కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతాయి. ఆలయంలో సాయంత్రం జరిగే లేజర్ షో ప్రత్యేక ఆకర్షణ. హనుమాన్ చలిసా శ్లోకాలను లేజర్ లైట్స్ ద్వారా విగ్రహంపై ప్రదర్శించడం అద్భుతంగా ఉంటుంది.

Also Read: Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

హనుమాన్ మహిమను ప్రతిబింబించే ఈ ప్రదర్శనను చూడటానికి భక్తులు దూర దూరాల నుండి తరలి వస్తారు. శనివారం, ఆదివారం రోజుల్లో సాయంత్రం 7.10, 7.40, 8.10 గంటలకు మూడు సెషన్లలో ఈ లేజర్ షో జరుగుతుంది. దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రదర్శన భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది.

ఈ సన్నిధి కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆధునిక సదుపాయాలతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పిస్తోంది. విస్తారమైన పార్కింగ్, సౌకర్యవంతమైన క్యూలైన్‌లు, శుభ్రమైన ప్రాంగణం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామి దర్శనం పొందేందుకు అన్నీ సదుపాయాలు కల్పించారు.

ఆలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. హనుమాన్ జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో భజన, హనుమాన్ చలిసా పారాయణం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, నృత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయి.

మైసూరు నగరాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ సన్నిధిని తప్పక దర్శించాల్సిందే. స్వామి దయతో కోరికలు నెరవేరతాయని, కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం భక్తి, శక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచి, మైసూరు పర్యటనలో తప్పనిసరిగా చూడాల్సిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తోంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×