Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్దం కావడంతో ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను కసరత్తును ప్రారంభించింది.
ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
త్వరలో ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఫైనల్ ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కసరత్తను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు, ఫైనల్ ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్లో ఐదుగురు మృతి
సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీల్లో ఓటర్ల లిస్ట్..
వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2వ తారీఖున గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆగస్టు 29న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.
ALSO READ: AAI Jobs: ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎంపికైతే లైఫ్ సెట్
ఈ నెల 30 అభ్యంతరాలు స్వీకరణ..
ఆగస్టు 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు తుది ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించనున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖును అధికారులు ఓటర్ల ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.