E-Paper
Advertisement

Puja Materials: పూజ తర్వాత మిగిలిన వస్తువులను ఏం చేయాలి ?

Puja Materials: పూజ తర్వాత మిగిలిన వస్తువులను ఏం చేయాలి ?
Advertisement

Puja Materials: ఇంట్లో రోజూ చేసే పూజ అయినా లేదా ప్రధాన మత పరమైన ఆచారం అయినా.. పూజ తర్వాత కొన్ని పదార్థాలు మిగిలిపోవడం సర్వసాధారణం. ఇలాంటి సమయంలో వివిధ పదార్థాలు, పువ్వులు, దండలు లేదా ఇతర నైవేద్యాలను పూజలో తిరిగి ఉపయోగించరు. కాబట్టి వాటిని ఎక్కడ పారవేయాలనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. కొన్ని పదార్థాలను పూజ గదిలో సురక్షితంగా నిల్వ చేయవచ్చు. మరికొన్నింటిని పారవేయడానికి మాత్రం కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పూజా వస్తువులను పారవేసేటప్పుడు, పరిశుభ్రత, మత పరమైన సంప్రదాయాలను అలాగే పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే.. పూజ కోసం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన , సహజమైన పదార్థాలను వాడండి. ప్లాస్టిక్ లేదా ఇతర హాని కరమైన పదార్థాలను నివారించండి.

దీపంలో మిగిలి ఉన్న నెయ్యి లేదా నూనె:

Advertisement

పూజలో ఉపయోగించిన నెయ్యి పూర్తిగా అయిపోకపోతే.. దానిని నిల్వ చేసి తర్వాత పూజలో దీపం వెలిగించడానికి ఉపయోగించవచ్చు. దీపంలో నెయ్యిని తిరిగి ఉపయోగించడం శుభప్రదంగా చెబుతారు. అయితే, నూనె విషయంలో జాగ్రత్త వహించాలి. దీపం పూర్తిగా కాలిపోయేలా పూజకు తగినంత నూనెను మాత్రమే వాడండి. పూజ తర్వాత మిగిలిపోయిన నూనెను మరే ఇతర ప్రయోజనం కోసం లేదా వంట కోసం ఉపయోగించడం వంటివి చేయకూడదు.

అక్షతం, పసుపు, కుంకుమ:

పూజలో సమర్పించే అక్షతం, పసుపు, కుంకుమను తిరిగి ఉపయోగించకూడదు. వాటిని తులసి మొక్క లేదా రావి చెట్టుకు సమర్పించడం ఉత్తమమని భావిస్తారు. కావాలనుకుంటే.. వాటిని శుభ్రమైన నీటిలో కూడా వేయవచ్చు. పక్షులకు అక్షతలు సమర్పించడం కూడా మంచి, ధర్మబద్ధమైన ఆచారం. వీటిని సమర్పించే ప్రదేశం శుభ్రంగా, ఉండేలా చూసుకోండి.

పూజ సమయంలో వాడిన పండ్లు, నైవేద్యాలు:

వీటిని అందరికీ పంచాలి. ఏవైనా మిగిలి ఉంటే.. ఆవులకు లేదా సమీపంలోని ఇతర జంతువులు, పక్షులకు తినిపించండి. పూజలో వాడిన ఆహార పదార్థాలను చెత్తబుట్టలో వేయడం అశుభంగా చెబుతారు. కాబట్టి వాటిని గౌరవంగా వాడండి.

పూజలో ఉపయోగించే దుస్తులు:

పూజలో ఉపయోగించే దుస్తులను మళ్ళీ పూజ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. అవి ధరించగలిగేవి అయితే.. అవసరంలో ఉన్న వారికి వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఇది పుణ్యం పొందడానికి దారి తీస్తుంది.

Also Read: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు.. అద్భుత శక్తి రూపాలు, సమ్మక్క సారలమ్మలు

పూజలో ఉపయోగించే పూలు, దండలు:

వీటిని ఎప్పుడూ చెత్త బుట్టలో వేయకూడదు. ఒక కుండలోని మట్టిలో పాతిపెట్టవచ్చు లేదా ఏదైనా చెట్టు మూలంలో ఉంచవచ్చు. ఇది వాటిని సహజంగా నేలలో కరిగిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా పర్యావరణానికి హాని కలిగించదు.

పూజలో ఉపయోగించే వత్తి:

దూదిని తులసి మొక్క దగ్గర ఉంచడం లేదా పవిత్ర స్థలంలోని మట్టిలో పాతిపెట్టడం సముచితంగా చెబుతారు. దానిని పారవేయడం మానుకోండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×