Big Stories

Jaggayyapeta Assembly constituency: జగ్గయ్యపేట జెండా పాతేదెవరు?

Jaggayyapeta Assembly constituency- Samineni Udaya Bhanu Vs Sriram Rajagopal: జగ్గయ్య పేట నియోజకవర్గం గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. ప్రస్తతం ఎన్టీఆర్ జిల్లాకి మారింది. గతంలో టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను విజయం సాధించారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ కు కేటాయించారు. శ్రీరాం తాతయ్యగా పాపులర్ అయిన ఈయన 2009, 2014లో రెండు సార్లు గెలిచారు. ఈసారి టీడీపీ ఎలాగైనా జగ్గం పేటలో గెలవాలని వ్య్యూహాలు పన్నుతోంది.

- Advertisement -

వైసీపి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 3న చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం. పందెంకోళ్లు 1 సర్వేకు, పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

సెగ్మెంట్ లో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుకు 47 శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ కనిపించగా, తాజా సర్వేలో 2 శాతం పెరిగి 49 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి విషయంలో జగ్గయ్యపేట ఓటరు నాడి స్పష్టంగా మారినట్లు తాజా సమీకరణాల ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అటు టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్యకు గత సర్వేలో 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపించగా, తాజా సర్వేలో 48 శాతానికి తగ్గింది. ఇక ఇతరులకు గత సర్వేలో 4 శాతం, తాజా సర్వేలో 3 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. అయితే స్వల్ప ఎడ్జ్ మాత్రం వైసీపీవైపే ఉంది.

రెండు సర్వేల్లో జగ్గయ్యపేట సెగ్మెంట్ లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

Also Read: నామినేషన్ల రోజు ఘర్షణలు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైటింగ్

గ్రౌండ్ లో యాక్టివ్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

జోరుగా సామినేని కుటుంబ సభ్యుల ప్రచారాలు

జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంపాక్ట్ చూపే అవకాశం

శ్రీరాం తాతయ్యకు నెట్టెం రఘురాం సపోర్ట్

టీడీపీ ఆధ్వర్యంలో గ్రౌండ్ లో యాక్టివ్ గా ప్రచారాలు

ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల నాటికి తటస్థ ఓటర్లు కీలకం కాబోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News