Mega Vs Allu : అల్లు ఫ్యామిలీ vs మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటుంది. ఏ చిన్న వార్త వచ్చినా ఇట్లే వైరల్ అవుతుంది. రెండు ఫ్యామిలీల మధ్య అంతగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ వార్ మాత్రం ఎక్కువగానే ఉంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బాబు అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పూకార్లు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పీరియాడిక్ మూవీ మట్కా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.. ఇక ఈ మూవీ లో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటి వరకు రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ భారీ బజ్ క్రియేట్ చేశాయి.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో భారీ సెట్ ను ఏర్పాటు చేసి నిర్వహించారు. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మట్కా సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు రిలీజ్ కానున్నది. వైజాగ్ బ్యాక్ డ్రాప్గా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖపట్నంలోనే నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగా అభిమానులు భారీగా వచ్చారు.. ఈ ఈవెంట్ లో వరుణ్ బాబు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. పవన్ కల్యాణ్, చిరంజీవి గార్లు ఎప్పుడూ గుండెల్లో ఉంటారు. ఈ మధ్య ఎవరో మాట్లాడుతూ.. ఎప్పడూ వారి గురించే మాట్లాడుతారా? అంటూ కామెంట్ చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడాలో నా ఇష్టం. ఇంట్లో పెద్దోడే అవ్వోచ్చు. కాకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు? ఎందుకు మొదలు పెట్టావు. ఎక్కడ నుంచి వచ్చావు. నీ సపోర్ట్ ఎవరు అని మరిచిపోతే.. నువ్వు ఇప్పటివరకు దక్కించుకొన్న సక్సెస్ ఎందుకు పనికి రాదు.. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించే అని స్పష్టం అవుతుంది. అయితే ఈ కామెంట్స్పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే… అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది.. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంత్రికి విడుదల కాబోతుంది.