Dil Raju:-చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం ‘బలగం’. మార్చి 3న సినిమా రిలీజైంది. కమెడియన్ వేణు ఎల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బలగం సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడక్షన్స్ను హర్షిత్, హన్షిత నిర్మాతలుగా స్టార్ట్ చేశారు. నేను నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆర్య, బొమ్మరిల్లు వంటి సినిమాలను చేశాను. అప్పుడు కొత్త వాళ్లతోనే ఆ సినిమాలు చేశాను. క్రమక్రమంగా అలాంటి అప్రోచ్ నా సైడ్ నుంచి తగ్గిపోయిందనాలి. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. అందుకని హర్షిత్, హన్షితలను కూర్చో పెట్టుకుని రీస్టార్ట్ కావాలని చెప్పాను. నిర్మాణ రంగంలోకి రావాలని అనుకుంటున్నారు, ఆసక్తి ఉందని అంటున్నారు కాబట్టి జర్నీ స్టార్ట్ చేయమని చెప్పాను. ఆ క్రమంలో చాలా స్క్రిప్ట్స్ వింటూ వచ్చాం. అప్పుడు నేను బలగం స్క్రిప్ట్ విన్నాను. దాన్ని వినమని హర్షిత్, హన్షితలకు చెప్పాను. వాళ్లు విన్నారు, నచ్చింది. దీంతో పాటు మరో రెండు స్క్రిప్ట్స్ నచ్చటంతో ఆ సినిమాలు కూడా స్టార్ట్ చేశాం. వీటితో పాటు ఏటీఎం వెబ్ సిరీస్ కూడా చేశారు. సినిమాల విషయానికి వస్తే.. బలగం సినిమానే దిల్ రాజు ప్రొడక్షన్స్లో ముందుగా పూర్తయ్యింది.
వేణు ఎల్దండి డైరెక్టర్గా డెబ్యూ అయ్యాడు. తను కథ చెప్పిన తర్వాత అంతా కొత్త వాళ్లతోనే ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు బడ్జెట్ వేసి ఇచ్చాను. సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే 25 శాతం ఎక్కువైంది. అందుకు సినిమా ఆలస్యం కావటం వంటి కారణాలు ఏవైనా కావచ్చు. వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని నాకు కూడా తెలియదు. తను కథ చెప్పే సమయంలోనే నేను కనెక్ట్ అయ్యాను. నేను తెలంగాణలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మనుషులు చనిపోయినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉంటాయనే దాన్ని నేను దగ్గర నుంచి గమనించాను. మన సంస్కృతిలో ఏముందనే విషయాన్ని వేణు పట్టుకున్న తీరు నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఆ సమయంలోనే సినిమాను కమర్షియల్ యాంగిల్లో కాకుండా నేచురల్గా ఉండాలని చెప్పాను.
బలగం సినిమా చూసిన వారందరూ అవార్డ్ వస్తుందని అంటున్నారు. అయితే నేను అవార్డు కోసం సినిమా చేయలేదు. వస్తే మంచిదే. ఇంతకు ముందు నేను చేసిన శతమానం భవతి, మహర్షి సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కానీ నేను అవార్డుల కోసం ఆ సినిమాను చేయలేదు. మంచి సినిమాలను అందించాలనే ఉద్దేశంతో చేశాను. డైరెక్టర్ వేణు ఎల్దండి మా బ్యానర్లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నాడు. రెండు నెలల క్రితం తను చెప్పిన ఐడియాస్లో ఒకటి బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేయమని చెప్పాను. రీసెంట్ దానికి సంబంధించిన క్లైమాక్స్ చెప్పాడు.సూపర్బ్గా ఉందనిపించటంతో వర్క్ చేయమని చెప్పాను. ఈ సారి చేసే సినిమా కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్ట్స్ ఇదే బ్యానర్లో ఓ డాన్స్ మాస్టర్ను హీరోగా .. సింగర్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాం. అది కూడా ఓ ఎక్స్పెరిమెంట్ మూవీ’’ అని తెలిపారు దిల్ రాజు.
- గోపీచంద్ ‘రామ బాణం’ సంధింపుకి డేట్ ఫిక్స్
- FOR MORE UPDATES FOLLOW THIS LINK:-BIGTV