Divvela Madhuri: సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్(Bigg Boss) లోకి అడుగు పెట్టింది దివ్వెల మాధురి . అక్కడ తనదైన శైలిలో పెర్ఫార్మన్స్ ఇచ్చి కొంతమంది చేత విమర్శలు కూడా ఎదుర్కొంది.. అలాంటి ఈమె ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడింది. ఏకంగా ఏడుకొండలపై గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ తనూజ (Thanuja) బర్తడే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
పూర్తి వివరాలలోకి వెళితే.. తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడం నిషిద్ధం.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా మాధురి కొండపైకి బర్తడే కేకును ఎలా తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది.. అంతకుముందు వీరే తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా చిక్కుల్లో పడ్డారు దువ్వాడ శ్రీనివాస్. మాడవీధుల్లో దివ్వెల మాధురి , దువ్వాడ శ్రీనివాస్ దంపతులు రీల్స్ వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేశారు. ఇందుకు సంబంధించి మాధురిపై కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్ బిగ్ బాస్ రన్నర్ తనూజ కోసం బర్తడే కేక్ తెప్పించి మరీ కట్ చేయించింది. అంతేకాదు తనుజాకి బంగారు చెవి దిద్దులు, గాజులతోపాటు చీరను బహుమతిగా అందించింది.
ఇక పుట్టినరోజు సందర్భంగా తనూజ బర్తడే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని దివ్వెల మాధురి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” హ్యాపీ బర్తడే బంగారం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు.. నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగి వచ్చావు. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను” అంటూ తనుజాకి శుభాకాంక్షలు తెలియజేసింది. పైగా ఈ పోస్ట్ కి తనూజ కూడా స్పందిస్తూ..” థాంక్యూ మ్యాడీ” అంటూ రిప్లై ఇచ్చింది .ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదంలో చిక్కుకుంది మాధురి. మరి ఈ విషయం నుండి మాధురి ఎలా బయటపడుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వాలు విధించిన రూల్స్ ని అతిక్రమిస్తూ ఇలా బర్తడే విషెస్ జరుపుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై దువ్వాడ శ్రీనివాస్ , దువ్వాడ మాధురి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:Sankranti 2027: నందమూరి వార్ తప్పదా? అనిల్ భలే స్కెచ్ వేసారే?
బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తనూజ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మాధురిని అమ్మ అని పిలుస్తూ తనలో తన తల్లిని చూసుకుంటున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది .అలా తల్లి కూతుర్లుగా హౌస్ లో నానా హంగామా చేశారు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోరు. కానీ వీరు ఇంకా ఆ థాట్ నుండి బయటకు రాలేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==