Poison Attack on Tamil Actor Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. ఛాతీలో నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోగా.. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటినుంచి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారమే లేదు. అయితే గత రాత్రి ఆయన కళ్లు తెరిచి తనపై విష ప్రయోగం జరిగిందని ఆరోపించడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
ప్రచారంలో ఉన్నప్పుడు కొందరు తనకు పండ్ల రసం, మజ్జిగ బలవంతంగా తాగించారని, అది తాగాకనే ఛాతీలో నొప్పి మొదలైందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియడంతో త్రిష అభిమానులు ఏకమయ్యారు. ఒక అమ్మాయి గురించి అంత నీచంగా మాట్లాడిది ఎవరైనా ఇలాగే చేస్తారు అని, తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈరోజు లోక్ సభ ఎలక్షన్స్ జరుగుతన్న వేళ.. పోలింగ్ బూత్ వద్ద మన్సూర్ హల్చల్ చేశాడు. ఓటు వేయడానికి వచ్చిన ఆయన.. కొన్ని గుర్తులు కనిపించడంలేదని గందరగోళం చేశాడు. వెంటనే అధికారులు అతనితో మాట్లాడి.. బయటకు పంపించేశారు.
Also Read: Harish Shankar: హరీష్ శంకర్ ను అవమానించిన ఛోటా.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్
మొదట ఇండియా జననాయక పులిగళ్ పార్టీలో ఉంటూ ఎవరి అనుమతి లేకుండా మరొక పార్టీతో పొత్తుకు పాల్పడడంతో ఇండియా జననాయక పులిగళ్ పార్టీ అతనిని పాటి నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు మన్సూర్.. స్వతంత్ర అభ్యర్థిగా వేలూరు నుంచి పోటీ చేస్తున్నాడు. గతంలో ఒకసారి ఓడిపోయిన మన్సూర్.. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.