Why Jyothika Not Used Her Vote: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ లో సూర్య -జ్యోతికల కుటుంబ విబేధాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అత్తమామలతో పడకే ఆమె తన కుటుంబంతో సహా ముంబైకు షిఫ్ట్ అయ్యిందని సమాచారం. కానీ, ఈ విషయం చెప్పకుండా సూర్య.. పిల్లల చదువుల కోసం అని చెప్పుకొచ్చి కవర్ చేశాడు. ఇక సూర్య.. ముంబైకు మకాం మార్చిన దగ్గరనుంచి డైలీ చెన్నైకు వచ్చి వెళ్తూ ఉన్నాడు కానీ, ఇప్పటివరకు జ్యోతిక మాత్రం చెన్నై ముఖం చూడలేదు. ఆమెకు చెన్నైలో అడుగుపెట్టాలని లేదని, ఈ మధ్య వారి అక్క వాళ్ళఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ఆమె రావడానికి సుముఖత చూపించలేదని టాక్ నడిచింది.
ఇక ఇప్పుడు జ్యోతిక ఓటు వేయడానికి కూడా రాలేదు. లోక్ సభ ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి సూర్య- కార్తీ కుటుంబం మొత్తం వచ్చి ఓటు వేసి వెళ్లేవారు. కానీ, ఈసారి జ్యోతిక తప్ప మిగతావాళ్ళందరూ కనిపించడంతో జ్యోతిక.. అత్తామామలతో గొడవల కారణంగానే ఆమె రాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిక ఎక్కడఉంది అంటే.. ఆమె రెండురోజుల క్రితమే హిమాలయాలకు ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: Nandamuri Balakrishna: తారకరత్న ఇంటికి కొడుకుతో పాటు వెళ్లిన బాలయ్య..
తాజాగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అక్కడ ఆమె ఎలా ఎంజాయ్ చేసిందో చెప్పుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఎలక్షన్స్ ఈరోజు ఉంటాయని తెలిసి, ఓటు వేయడానికి ఆమె చెన్నై రావాలని తెలిసి కూడా ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసింది. అంటే.. ఇక్కడకు రాకుండా తప్పించుకోవడానికే ఆమె ఈ ట్రిప్ ప్లాన్ చేసిందా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం జ్యోతిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.