ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆది పురుష్’. రామాయణంను డైరెక్టర్ ఓం రౌత్ ..‘ఆది పురుష్’గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలతో తెరకెక్కించటం వల్ల సినిమాపై ఉన్న హైప్ అంతా డ్రాప్ అయ్యింది. అది కాకుండా సినిమాలో ఉపయోగిస్తున్న వి.ఎఫ్.ఎక్స్ టెక్నాలజీపై ఘాటు విమర్శలే వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల విడుదలైన టీజర్లో రావణాసురుడగా నటించిన సైఫ్ అలీ ఖాన్ లుక్, రాముడికి తోడుగా నిలిచిన వానర సైన్యం సహా పలు విషయాలపై నెటిజన్స్ గట్గిగానే ట్రోల్ చేశారు. దీంతో ఆది పురుష్ టీమ్ ఆలోచనలో పడింది. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అనౌన్స్మెంట్ కూడా చేశారు.
అయితే సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డ్రాప్ కావటంతో పాటు తెలుగులో భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో … డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు ఆది పురుష్ మేకర్స్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు.. ఇప్పుడు ఆది పురుష్ వచ్చే ఏడాది సమ్మర్లోనూ విడుదల కావటం లేదట. మేకర్స్ సినిమా వి.ఎఫ్.ఎక్స్ అంతంటినీ మార్చాలనుకుంటున్నారట. అందుకు సమయం పట్టినా పరావాలేదని భావిస్తున్నారు. దీని వల్ల ఆది పురుష్ విడుదల వెనక్కి వెళుతుందని అంటున్నారు. మరి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.