E-Paper
Advertisement

Raj Tarun’s Purushothamudu: ‘పురుషోత్తముడు’లో వల్గారిటీ లేదు.. ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి

Raj Tarun’s Purushothamudu: ‘పురుషోత్తముడు’లో వల్గారిటీ లేదు..  ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి
Advertisement

Raj Tarun’s Purushothamudu Movie: ఈ నెల 26న ‘పురుషోత్తముడు’ మూవీ రిలీజ్ కాబోతున్నది. టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో శ్రీశ్రీదవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి డా. రమేశ్ తేజావత్ నిర్మతగా పనిచేస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా, హాసినీ సుధీర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడారు. ‘గతంలో నేను రెండు సినిమాలకు డైరెక్టర్‌గా పనిచేశాను. వాటితో నాకు చాలామంచి పేరు వచ్చింది. ఇటు నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆరేళ్ల తరువాత మళ్లీ ‘పురుషోత్తముడు’ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. ప్రకాశ్ రాజ్, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ, రమ్యకృష్ణ లాంటి పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారు అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కథను రూపొందించడానికి కారణం ఒక న్యూస్ ఆర్టికల్. దానిని చదివి ఈ స్టోరీ రాశాను. కోటీశ్వరుడైన ఓ యువకుడు పల్లెటూరుకు ఎందుకు రావాల్సి వచ్చింది.. అక్కడ ఏం చేశాడనేది ‘పురుషోత్తముడు’ స్టోరీ. ఇంతవరకు ఏ సినిమాలో లేని అంశాలను మీ ముందు ఉంచబోతున్నాం. ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి. కథా నాయకనాయికలుగా రాజ్ తరుణ్, హాసినీ సుధీర్.. వారి పూర్తి సపోర్ట్‌ను సినిమాకు అందించారు. ఈ సినిమా చూసిన తరువాత ఎలా ఉందో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను’ అంటూ రామ్ భీమన పేర్కొన్నారు.

Advertisement

అనంతరం నిర్మాత డా. రమేశ్ తేజావత్ మాట్లాడుతూ.. ‘నేను ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి చాలారోజులవుతుంది. అక్కడే సెటిల్ అయ్యాను. బిజినెస్‌లో నేను బాగా రాణిస్తున్నాను. అయితే, నాకు సినిమాలంటే చాలా ప్యాషన్. ఒక మంచి తెలుగు సినిమాకు నిర్మాతగా పనిచేయాలనే కోరిక మనసులో ఉండేది. ఆ కోరిక ఇప్పుడు ఈ సినిమాతో తీరిపోయింది. సినిమాలు తీయడమంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా కథాకథనాలు, ఆర్టిస్టుల ఎంపిక, సాహిత్యం, మ్యూజిక్.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అంశంపైన పూర్తిగా జాగ్రత్తగా ఉంటూ క్వాలిటీగా ఈ సినిమాను రూపొందించాం. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 6 నెలల సమయం తీసుకున్నామంటే సినిమా క్వాలిటీ కోసం మేం తీసుకున్న జాగ్రత్త ఎంటో మీకే అర్థం అవుతుంది. చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం ‘పురుషోత్తముడు’ సినిమాకు ఆకర్షణ కానున్నది. సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాం. ఇక నుంచి వరుసగా సినిమాలు తీయాలనుకుంటున్నాం. త్వరలోనే మరో కొత్త సినిమాను ప్రకటిస్తాం’ అని నిర్మాత స్పష్టం చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×