Rajendra Prasad : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. గత కొన్ని లుగా హిట్ సినిమా లేకుండా సతమతమవుతున్న హీరో నితిన్ ఈసారి పక్కాగా హిట్ కొడతానని అంటున్నాడు. రాబిన్ హుడ్ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 28న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు చిత్రబృందం.. తాజాగా ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్యనటుడు రాజేంద్రప్రసాద్ స్పీచ్ హైలెట్ అయింది. ప్రస్తుతం ఆయన స్పీచ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డేవిడ్ ను స్టేజ్ పైన తిట్టడంతో చాలామంది రాజేంద్ర ప్రసాద్ పై మండిపడుతున్నారు. అసలు రాజేంద్రప్రసాద్ ఏమన్నాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం..
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
నితిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్.. ఈ మూవీకి వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.. ఈ మూవీలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే గత కొద్ది రోజులుగా ఈయన గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు ఈయన పాత్ర హైలెట్గా నిలవాలని ఉందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి ఆయన కూడా హాజరవడం విశేషం.
Also Read : సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై.. అడ్వాన్స్ వెనక్కి ఇస్తాడా..?
డేవిడ్ వార్నర్ ను అవమానించిన నటుడు..
ఈ మూవీలో కీలక పాత్రలో ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ.. రేయ్ అంటూ వార్నర్ ను సంబోధించారాయన. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే ఇలా మాట్లాడారు.
కానీ ఈ వీడియోను అందరు వైరల్ చేస్తున్నారు. ఇక 48 ఏళ్లుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ ఉండటానికి కారణం మైత్రీ మూవీస్ నా సొంత కంపెనీ లాంటిది. నవీన్, రవి వీళ్లంతా నా బిడ్డలు.. వీళ్ళతో ఇలా మళ్లీ సినిమాలు తీయడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ రాజేంద్రప్రసాద్ అన్నారు అటు నితిన్ పై రాజేంద్రప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక చివరగాఅద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ చూసినప్పుడు సమ్మర్ పోతుంది.. మీరు ఫ్యామిలీతో పాటు వెళ్లి ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ అన్న వ్యాఖ్యల పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..