Sharwanand: శర్వానంద్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. గత ఏడాది వరకు ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే ట్యాగ్తో తిరిగారు. అయితే ఈ హీరో ఎంగేజ్మెంట్ జనవరి 26న జరిగింది. యు.ఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోన్న రకితా రెడ్డితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఫంక్షన్కి పలువురు సెలబ్రిటీలు హజరయ్యారు. అయితే తాజాగా శర్వానంద్ రక్షితల పెళ్లి ఆగిపోయిందంటూ, ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. వీరి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పకపోవటం అనేది వార్తలకు కారణమైంది.
అయితే ఈ వార్తలపై శర్వానంద్ టీమ్ వివరణ ఇచ్చింది. శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి ఆగిపోలేదని, ఎంగేజ్మెంట్ బ్రేక్ కాలేదని వారు తెలిపారు. శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు లండన్లో షూటింగ్ను పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఆయన పెళ్లిని కొన్ని రోజుల వరకు ఆగి చేసుకుందామని అనుకుంటున్నారు. పెళ్లి తేది కుదిరిందని, త్వరలోనే ఆ డేట్ను తెలియజేస్తారని శర్వా టీమ్ తెలియజేసింది.
సాలిడ్ హిట్ కోసం శర్వానంద్ చాలా రోజులుగా వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నారు. గత ఏడాది ఒకే ఒక జీవితం కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. శర్వా మాత్రం బ్లాక్ బస్టర్ ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ఆదిత్యతో ఆయన చేతులు కలిపారు. మరి ఈ దర్శకుడైనా శర్వానంద్కు ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి మరి.