E-Paper
Advertisement

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?
Advertisement

Boy : కట్టుకున్న టవల్ తోనే కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ బాలుడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే..?

ఏలూరు కొత్తపేటకు చెందిన సాయి దినేష్‌కు పదేళ్లు. తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్‌కు ఓ సోదరి కూడా ఉంది. ఆదివారం సాయి దినేష్‌ స్నానం చేసి సవతి తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమని అడిగాడు. స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని తెలిపాడు. అందుకు ఆమె నిరాకరించింది. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. మారాం చేస్తుంటే కొట్టింది. దీంతో దినేష్‌ చొక్కా వేసుకోకుండానే టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి సవతితల్లిపై ఫిర్యాదు చేశాడు.

Advertisement

సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఆ బాలుడిని అప్పగించారు.

గతేడాది అల్లరి చేశాడని సాయి దినేష్‌కు సవతి తల్లి వాతలు పెట్టిందని అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×