BigTV English

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

Boy : కట్టుకున్న టవల్ తోనే కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ బాలుడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే..?


ఏలూరు కొత్తపేటకు చెందిన సాయి దినేష్‌కు పదేళ్లు. తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్‌కు ఓ సోదరి కూడా ఉంది. ఆదివారం సాయి దినేష్‌ స్నానం చేసి సవతి తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమని అడిగాడు. స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని తెలిపాడు. అందుకు ఆమె నిరాకరించింది. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. మారాం చేస్తుంటే కొట్టింది. దీంతో దినేష్‌ చొక్కా వేసుకోకుండానే టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి సవతితల్లిపై ఫిర్యాదు చేశాడు.

సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఆ బాలుడిని అప్పగించారు.


గతేడాది అల్లరి చేశాడని సాయి దినేష్‌కు సవతి తల్లి వాతలు పెట్టిందని అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×