Big Stories

Taraka Ratna : తార‌క‌ర‌త్న‌తో చివ‌రి సారిగా ఆడుకున్న వీడియో రిలీజ్ చేసిన కుమార్తె

Taraka Ratna

Taraka Ratna : సినీ హీరో, తెలుగుదేశం పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చిన నంద‌మూరి వార‌సుడు తార‌క‌ర‌త్న‌ఫిబ్ర‌వ‌రి 18న చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. 23 రోజులు చావుతో పోరాటం చేసిన త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూశారు. ఇది నిజంగా ఆయ‌న కుటుంబానికి తీర‌ని లోటు. తార‌క‌ర‌త్న‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయ‌న స‌తీమ‌ణి అలేఖ్య రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా తార‌క‌ర‌త్న కుమార్తె నిషిక ఓ వీడియో పోస్ట్ చేసింది.

- Advertisement -

తార‌క‌ర‌త్న పొలిటిక‌ల్ టూర్‌లో భాగంగా హిందూపురంకు బ‌య‌లు దేర‌టానికి ముందు కుమార్తె నిషిక‌తో క‌లిసి ఆడుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన నంద‌మూరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అలాగే వుయ్ మిస్ యు తార‌క‌ర‌త్న అని సోష‌ల్ మీడియాలో బాధ‌ను వ్య‌క్తం చేశారు.

- Advertisement -

జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన నారా లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు తార‌క ర‌త్న ద‌గ్గ‌రుండి స‌న్నాహాలు చేశారు. తొలి రోజున ఆయ‌న కూడా లోకేష్‌తో క‌లిసి ఆ యాత్ర‌లో పాల్గొన్నారు. అయితే ఉన్న‌ట్లుండి గుండె నొప్పి రావ‌టంతో కుప్ప‌కూలారు. వెంట‌నే ఆయ‌న్ని బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ వెంటిలేట‌ర్‌పై ఉంచి విదేశీ వైద్యుల‌తో చికిత్స‌ను అందించారు. అయితే ఆ వైద్యం ఫ‌లించ‌లేదు.

తార‌క‌ర‌త్న హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు, చ‌నిపోయిన‌ త‌ర్వాత ఆయన కుటుంబ స‌భ్య‌ల‌కు నంద‌మూరి బాల‌కృష్ణ అండ‌గా నిలిచారు.అలాగే వైసీపీ పార్టీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి కూడా వారికి మద్దతుగా నిలిచారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అందుకు సుముఖతను వ్యక్తం చేశారు. అయితే అనుకోకుండా, ఎవరూ ఊహించని విధంగా తారక రత్నతిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

LINK – https://www.instagram.com/reel/CqIwFMmIs8P/?utm_source=ig_web_copy_link

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News