Ranya Rao : కన్నడ బ్యూటీ రన్యా రావు దుబాయ్ నుంచి భారీ మొత్తంలో బంగారం తరలిస్తు దొరికి పోయిన సంగతి తెలిసిందే.. భారీగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తు అడ్డంగా బుక్కయింది. స్మగ్లింగ్ కేసు కావడంతో అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటికే ఇప్పటికే అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు రన్యా రావు కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. సీబిఐ కి కేసు బదిలీ అవ్వడం తో ఈ కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆమె ఇలా గోల్డ్ ను తరచూ తరలిస్తు వస్తుందని తేలింది. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
కన్నడ బ్యూటీ రన్యా రావు పేరు ప్రస్తుతం నిత్యం వార్తల్లో వినిపిస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డీజీపీ రామచంద్రరావు కూతురు రన్యాను మార్చి 7 నుంచి 11 వరకు డీఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించిందని, ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అతనికోసమే గోల్డ్ అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆమె ఒప్పుకుంది. దాంతో ఈ కేసును మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ఆమెను పట్టించడానికి సహకరించింది. ఒక వ్యక్తి అని ఓ వార్త సోషల్ మీడియలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న పాయల్ రాజ్ పుత్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
ఆమెను ఈ కేసులో పట్టుబడేలా చేసింది ఆమె భర్తే అంటూ ఓ వార్త వినిపిస్తుంది.. నిజానికి ఈ కేసులో ఆమె పట్టు పడడానికి కారణం డిఆర్ఐ అధికారులు మాత్రం కాదని తెలుస్తుంది.. ఆమెను ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీ చేయడానికి కారణం ఆమె భర్త అని తెలుస్తుంది. పెళ్లయినా రెండు నెలల నుంచి ఆమె విదేశాలకు వెళ్లడం పై ఆమె భర్త మండిపడ్డాడు వాళ్ళిద్దరి మధ్య అనేకసార్లు గొడవలు కూడా జరిగాయట. ఆమె తీరు మార్చుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా ఆమె భర్త మాట వినకపోవడంతో ఆయన ఆమె చేస్తున్న విషయాలని బయట పెట్టాలని అనుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె గోల్డ్ రవాణా చేస్తున్న విషయాన్ని అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని సమాచారం.. దాంతో అధికారులు ఆమెను తనిఖీ చేశారు. అలా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె దుబాయ్ మాత్రమే కాదు యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా ఆమె బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 2024 లోనే ఆమె 30 సార్లు దుబాయ్కు వెళ్లిందని, ఇటీవలే కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రతి ట్రిప్లో కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారించారు.. ఇక ఈమె వెనుక ఉండి నడిస్తున్న బడా వ్యక్తులను తెలుసుకొనే ప్రయత్నలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తుంది.