E-Paper
Advertisement

Plateau School Collapse: కుప్పకూలిన స్కూల్.. 22 మంది పిల్లలు మృతి.. శిథిలాల్లో 100 మంది!

నైజీరియాలో ఓ రెండు అంతస్తుల స్కూలు భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 22 విద్యార్థులు చనిపోగా.. 100 మందికిగా శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం, ప్లాట్యూ స్టేట్.. బుసా బుజీ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగింది. ఉదయం పిల్లలు స్కూలుకు వచ్చిన కొంతసేపు తరువాతే ఘటన జరగింది.

Plateau School Collapse: కుప్పకూలిన స్కూల్.. 22 మంది పిల్లలు మృతి.. శిథిలాల్లో 100 మంది!
Advertisement

Plateau School Collapse: నైజీరియాలో ఓ రెండు అంతస్తుల స్కూలు భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 22 విద్యార్థులు చనిపోగా.. 100 మందికిగా శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం, ప్లాట్యూ స్టేట్.. బుసా బుజీ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగింది. ఉదయం పిల్లలు స్కూలుకు వచ్చిన కొంతసేపు తరువాతే ఘటన జరగింది.

స్కూలు భవనం కూలిందని సమాచారం అందుకోగానే పోలీసులు, రక్షణ బలగాలు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేమెంట్ ఏజెన్సీ తెలిపింది. చాలామంది గ్రామస్థులు స్కూలు వద్దకు చేరుకొని.. శిథిలాల్లో చిక్కుకొని ఉన్నవారిని బయటికి తీయడానికి సహాయం చేశారు.

Advertisement

Also Read: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

కూలిన భవనం నుంచి ఇప్పటికే 154 మందిని కాపాడి వెలికి తీశామని.. అందులో 132 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్లాటూ స్టేట్ కమిషనర్ మూసా అషోమ్స్ చెప్పారు. గాయపడిన వారికి.. ఎటువంటి ఖర్చులు లేకుండా వెంటనే వైద్యం అందించమని సమీప ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేశామని అన్నారు.

Advertisement

స్కూలు భవనం చాలా పాతబడిందని.. భవనంలో చాలా భాగాలు బలహీనంగా ఉండడం, నదీ ఒడ్డుకు స్కూలు భవనం సమీపంగా ఉండడమే భవనం కూలిపోవడానికి కారణమని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు.

ఆఫ్రికా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం నైజీరియా. భవనాలు కూలిపోయే దుర్ఘటనలు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతున్నాయి. భవన నిర్మాణ నియమాలు సరిగా పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటనలు జరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×