E-Paper
Advertisement

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు
Advertisement

Office: ఉద్యోగులు ఇళ్లకంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరికొంత మందైతే ఇంటికి వెళ్లినా కూడా ఆఫీస్ పనిలోనే నిమగ్నమైపోతున్నారు. నిత్యం ల్యాప్‌టాప్‌లతో కుస్తీ పడుతున్నారు. దీంతో వర్క్ ప్రెజర్ పెరిగి వ్యక్తి గత జీవితానికి దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కోల్పోతున్నారు. ఈక్రమంలో బ్రిటన్‌కు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఇంటే ఎటువంటి ఫలితాలు వస్తాయనే దానిపై ట్రయల్ నిర్వహించాయి. ఈ ట్రయల్‌లో ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 61 కంపెనీలు గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలలు ఈ ట్రైయల్ నిర్వహించాయి.

Advertisement

ఇందులో మొత్తం 30 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఒకరోజు వర్కింగ్ డే తగ్గినా కూడా వారి వేతనంలో ఎటువంటి కోత విధించలేదు. పూర్తి జీతాన్ని చెల్లించారు. ఇక ఆరు నెలల పాటు జరిగిన ఈ ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీలు తెలిపాయి.

భవిష్యత్తులో కూడా వారంలో నాలుగు రోజుల పనిదినాలనే అమలు చేస్తామని ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ప్రకటించాయి. మరో 5 శాతం కంపెనీలు పాత పద్ధతినే కొనసాగిస్తామని స్పష్టం చేయగా.. 4 శాతం కంపెనీలు మాత్రం సందిగ్ధంలో ఉన్నాయి.

Advertisement

అటు నాలుగు రోజులే పనిదినాలు ఉండడంతో ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని కంపెనీలు తెలిపాయి. అలాగే ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని.. ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు క్రమంగా తగ్గిపోయాయని వెల్లడించాయి. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగులకు సమయం దొరుకుతుందని చెప్పాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×