E-Paper
Advertisement

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు
Advertisement

Office: ఉద్యోగులు ఇళ్లకంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరికొంత మందైతే ఇంటికి వెళ్లినా కూడా ఆఫీస్ పనిలోనే నిమగ్నమైపోతున్నారు. నిత్యం ల్యాప్‌టాప్‌లతో కుస్తీ పడుతున్నారు. దీంతో వర్క్ ప్రెజర్ పెరిగి వ్యక్తి గత జీవితానికి దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కోల్పోతున్నారు. ఈక్రమంలో బ్రిటన్‌కు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఇంటే ఎటువంటి ఫలితాలు వస్తాయనే దానిపై ట్రయల్ నిర్వహించాయి. ఈ ట్రయల్‌లో ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 61 కంపెనీలు గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలలు ఈ ట్రైయల్ నిర్వహించాయి.

Advertisement

ఇందులో మొత్తం 30 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఒకరోజు వర్కింగ్ డే తగ్గినా కూడా వారి వేతనంలో ఎటువంటి కోత విధించలేదు. పూర్తి జీతాన్ని చెల్లించారు. ఇక ఆరు నెలల పాటు జరిగిన ఈ ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీలు తెలిపాయి.

భవిష్యత్తులో కూడా వారంలో నాలుగు రోజుల పనిదినాలనే అమలు చేస్తామని ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ప్రకటించాయి. మరో 5 శాతం కంపెనీలు పాత పద్ధతినే కొనసాగిస్తామని స్పష్టం చేయగా.. 4 శాతం కంపెనీలు మాత్రం సందిగ్ధంలో ఉన్నాయి.

Advertisement

అటు నాలుగు రోజులే పనిదినాలు ఉండడంతో ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని కంపెనీలు తెలిపాయి. అలాగే ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని.. ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు క్రమంగా తగ్గిపోయాయని వెల్లడించాయి. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగులకు సమయం దొరుకుతుందని చెప్పాయి.

Tags

Related News

అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×