E-Paper
Advertisement

Israel Strikes: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్.. 42 మంది మృతి

Israel Strikes: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్.. 42 మంది మృతి
Advertisement

Israel StrikesIsrael Strikes: ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై రెచ్చిపోయింది. ఓ పక్క హమాస్ తో యుద్ధం జరుగుతుండగానే సిరియాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. సిరియాలో అతిపెద్ద నగరమైన అలెప్పోపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. అయితే ఈ దాడిలో 42 మంది మృతి చెందారు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దళాలు సిరియాపై దాడి చేశాయి. ఈ దాడిలో మొత్తం 42 మంది మృతి చెందగా.. వారిలో 36 మంది సిరియా సైనికులే ఉన్నట్లు ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది.

Advertisement

ఇజ్రాయెల్ దాడిలో సిరియా సైన్యం ఈ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్ బొల్లాకు చెందిన రాకెట్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.

ఇరాన్ కు అనుకూలంగా ఉన్న సిరియా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు జరిపిందని బ్రిటన్ సంస్థ పేర్కొంది. అయితే తమ సైనికులు మృతిచెందినట్లు సిరియా సైన్యం కూడా అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Also Read: Arvind Kejriwal Arrest: అమెరికా, జర్మనీ బాటలో నడిచిన యూఎన్.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందన

అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యంతో పాటుగా స్థానిక తిరుగుబాటు దళాలు కూడా దాడి చేసినట్లు సిరియా పేర్కొంది. ఈ దాడి సిరియా సైనికులతో పాటుగా సాధారణ పౌరులు కూడా కొంత మంతి మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×