Big Stories

Bangladesh MP Murder: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య.. ముగ్గురు అరెస్ట్

Bangladesh MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ కోల్‌క‌తాలో దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌క‌తాలోని న్యూటౌన్ లో బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం దారుణంగా హత్య చేశారు. ఎంపీ అన్వరుల్ మే 12న మెడికల్ చెకప్ కోసం బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అజీమ్ బంగ్లాదేశ్ లోని జెనైదా నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. కోల్ కతా పోలీసుల వివరాల ప్రకారం ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురైనట్లు భావించిన భవనంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. నిందితులు హత్య చేసి మృత దేహాన్ని సమీపంలోనే పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Also Read:ఇరాన్ అధ్యక్షుడి మృతి విషయంలో స్పందించిన అమెరికా.. ఏం చెప్పిందంటే..?

ఇదిలా ఉంటే అన్వరుల్ హత్యను బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ధృవీకరించారు. అధికార పార్టీ ఎంపీని కోల్ కతాలో ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని..వారు బంగ్లాదేశీయులేనని చెప్పారు. హత్య కేసులో భారత పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మే 12న వైద్య చికిత్సల కోసం ఎంపీ న్యూఢిల్లీ వచ్చారు. అనంతరం తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి వచ్చారు. తర్వాత ఆయన అదృశ్యం అయ్యారు. దీంతో ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News