E-Paper
Advertisement

Sheikh Hasina:షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు యత్నాలు

Sheikh Hasina:షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు యత్నాలు
Advertisement

Bangladesh take necessary steps to extradite deposed on Sheikh Hasina: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ను అస్తవ్యస్తం చేశాయి. ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమై చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాదు..విదేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక సంఘటనలతో షేక్ హసీనా ఆమె అనుచరులపై హత్యా నేరం కేసులు నమోదు చేశారు బంగ్లా దేశ్ ప్రస్తుత పాలకులు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో భీతిల్లిన షేక్ హసీనా భారత్ కు పారిపోయి ..అప్పటినుంచే ఇక్కడే తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా గత పదిహేనేళ్లుగా భారత్ కు మద్దతుదారుగా ఉంటున్నారు. దీనితో తన ప్రాణాలకు రక్షణ ఇక్కడే సాధ్యం అని భావించారామె.

హత్యారోపణ కేసులు

Advertisement

హసీనా, ఆమె అనుచరులపై సామూహిక హత్యల నేరారోపణకు సంబంధించి పలు కేసులు బుక్కయ్యాయి. తప్పనిసరిగా ఆమెను స్వదేశం పిలిపించి విచారిస్తామని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపారు. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక తాజుల్ ను చీఫ్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ విషయంలో భారత రాయబారితో మాట్లాడి నిందితులను అప్పగించేలా ఒప్పందం చేసుకుంటామని తాజుల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం రిజర్వేషన్ల అంశంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు..ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలలో దాదాపు వెయ్యి మందికి పైగా మృతి చెందినట్లు వార్తా కథనాలు వచ్చాయి. దాదాపు రెండు నెలలుగా జరిగిన మారణ హోమానికి షేక్ హసీనా, ఆమె అనుచరులే కారణమని మరో తొమ్మిది మందిపై బంగ్లా అధికారులు కేసులు నమోదు చేయడం గమనార్హం.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×