E-Paper
Advertisement

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..
Advertisement

Indonesia : ఇండోనేసియాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైవేటు కంపెనీకి చెందిన కోల్‌మైన్‌లో ప్రమాదకరమైన మీథేన్‌ లాంటి వాయువుల కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్లాస్ట్‌ కారణంగా గాయపడిన మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.

విషవాయువులు పీల్చడం వల్లనే కార్మికులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం కాలిన గాయాలతోనే చనిపోయారని తేలింది. దాంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×