Iran Strong Warning: అమెరికాపై మరోసారి ఇరాన్ విరుచుకుపడింది. అంతేకాదు ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో అమెరికా పశ్చాత్తాపం పడుందుని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వ్యాఖ్యానించారు. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆగ్రహం వెనుక అసలేం జరిగింది?
అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
విశాఖలో ఫిబ్రవరి 18 నుంచి 25 బంగాళాఖాతంలోమిలన్ ఇంటర్నేషనల్-2026 ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇండియన్ నేవీ ఆహ్వానం మేరకు ఇరాన్ నుంచి ఫ్రిగేట్-క్లాస్ యుద్ధ నౌక వచ్చింది. విశాఖలో కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా శ్రీలంక దక్షిణంగా హిందూ మహా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా దాడి చేసింది.
ఈ ప్రమాదం సమయంలో 130 మందికి 87 మంది మరణించారు. మరో 30 మందిని శ్రీలంక నేవీ రక్షించించింది. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై అమెరికా బహిరంగ ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేశామని, అందులోని వారంతా చనిపోయారని వ్యాఖ్యానించింది. దీనిపై ఇరాన్ నోరు విప్పింది.
అంతర్జాతీయ జలాల్లో యుద్దనౌక్ పేల్చివేతపై ఇరాన్ ఆగ్రహం
ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ దాడి తీవ్రంగా ఖండించారు. సముద్రంలో జరిగిన దారుణమైన ఘటనగా అభివర్ణించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం అంటే 1945 తర్వాత మొదటిసారి అమెరికా ఇలాంటి ఘటనకు పాల్పడిందని వ్యాఖ్యానించారు.
ఇరాన్లో కొత్త సుప్రీం ఎవరొచ్చినా చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణించబడతారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వ్యాఖ్యల తర్వాత తొలిసారి ఇరాన్ నుంచి ఆ తరహా హెచ్చరిక వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యలు.. దానిపై ఇరాన్ సీరియస్గా స్పందించడంతో యుద్ధం ఇప్పట్లో ఆగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: హార్ముజ్ జలసంధి రవాణాపై ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్, చైనాకు గుడ్ న్యూస్
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
యుద్ధ నౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడి ఘటనపై ఘాటుగా స్పందించిన ఇరాన్
ఈ విషయంలో అమెరికాలో త్వరలోనే పశ్చాత్తాపపడుతుందన్న ఇరాన్
చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని.. ఇరాన్ సైనికుల రక్తం వృథా పోదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి… https://t.co/fbtOyVJ62K pic.twitter.com/y4mDYe8dZE
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2026