E-Paper
Advertisement

Israel-Hamas : UN సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం సిగ్గుచేటు : ప్రియాంక గాంధీ

Israel-Hamas | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రవేశపెట్టిన సంధి తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

Israel-Hamas : UN సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం సిగ్గుచేటు : ప్రియాంక గాంధీ

Israel-Hamas | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రవేశపెట్టిన సంధి తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ సంధి తీర్మానంపై భారత్ ఓటు వేయకపోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన సంధి తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. భారత్ తీరుపై షాక్ కు గురయ్యానని, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు.

ట్విట్టర్ వేదికగా ఆమె తన అభిప్రాయం తెలియజేశారు. సత్యం, అహింస, లాంటి పునాదులపై ఏర్పడిన దేశం నుంచి అంతర్జాతీయ వేదికపై ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. ‘కంటికి కన్ను’ అనే ప్రతీకార విధానాన్ని భారతదేశం ఎప్పుడూ సమర్థించలేదని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ – హమాస్ తక్షణమే మానవీయ కోణంలో యుద్ధ విరమణ చేయాలన్న ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు భారతదేశం ఆమోదించకపోవడం బాధాకరమైన విషయమన్నారు.

మానవతా దృష్ట్యా తక్షణమే యుద్ధ విరమణ చేపట్టి, గాజా నివాసులకు నిత్యావసర సహాయం అందించేందుకు వీలు కల్పించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లో ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఆ తీర్మానాన్ని జోర్డాన్ ప్రవేశపెట్టగా, 120 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. 12 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొనని దేశాల్లో భారత్, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, ఉక్రెయిన్ తదితర దేశాలున్నాయి. భారత్ తీరుపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×